యేసుక్రీస్తు బోధనలు మానవాళికి దిక్సూచి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24 : క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి  క్రైస్తవ సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు బోధనలు ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని అన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూ చిగా నిలు స్తోం దన్నారు.

ఇతరుల పట్ల ప్రేమ, సహనం, శాంతి, సేవాభావం వంటి గొప్ప గుణాలను ఆచరించాలని శాంతి దూత ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. యేసు ప్రభువు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. క్రిస్టియన్‌ మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. రాష్ట్రమంతటా క్రిస్మస్‌ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page