రూ.3,900 కోట్ల విలువైన పనులకు ప్రారంభం
•నీటి సంరక్షణ పథకాలతో రైతులకు మేలు
•ఈ దశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి
•కాగజ్నగర్ వేదికగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
కుమ్రంభీమ్ ఆసిఫాబాద్,ప్రజాతంత్ర,మే5: తెలంగాణలో రోడ్ల అభివృద్ది బాధ్యత తనదని..అయితే నీటి సంరక్షణ ద్వారా భవిష్యత్ తరాలకు మనం నీటి నిల్వలు అందించాల్సి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ బాధ్యతను స్వీకరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రి గడ్కరీ కోరారు.విదర్భ ప్రాంతంలో నీటి నిల్వల ప్రాజెక్టులు చేపట్టి విజయం సాధించామని అన్నారు. వ్యవసాయం, ఉపాధి, రవాణా, మౌలిక వసతులు అనే 4 అంశాలు దేశాభివృద్ధిని నిర్దేశిస్తాయన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో సభావేదికపై నుంచి జాతీయ రహదారులను ఆయన ప్రారంభించారు. రూ.3,900 కోట్ల విలువైన పనులను ప్రారంభించారు. .ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక పై నుంచే 7 జాతీయ రహదారులు ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, భూమికోసం, భుక్తి కోసం.. జిల్లా ప్రజలు ఎన్నో పోరాటాలు చేశారని, ఆదిలాబాద్ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిరదని, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. చీకటి ఉండే చోట వెలుగులు నింపాలని, తనకు 13 డాక్టరేట్లు ఉన్నాయని.. తాను ఇంజనీరును కానని, అయినా 13 డాక్టరేట్లు ఉన్నాయని నితిన్ గడ్కరీ చెప్పారు.
ఇక్కడి ప్రజల సమస్యలు అర్థం చేసుకునే రోజు వచ్చిందని అన్నారు. పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోందని, రోడ్లు బాగున్న దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తారని అన్నారు. భద్రాద్రి, బాసర, మేడారం ఆధ్యాత్మిక క్షేత్రాలు హైవేతో అనుసంధానం చేస్తామని చెప్పారు. సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మిస్తామన్నారు. నాగపుర్ నుంచి విజయవాడ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. జగిత్యాల కరీంనగర్ హైవే విస్తరణ వేగవంతం చేస్తామని, వ్యవసాయం, ఉపాధి, రవాణా, మౌలిక వసతులే దేశాభివృద్ధి అని అన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోందని చెప్పారు. రహదారులు మెరుగ్గా ఉండే దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ సందర్భంగా అన్నారు.
రాష్ట్రాల మధ్య అనుసంధానం పెంచేందుకు కీలకమైన ప్రాజెక్టును కేంద్రం చేపట్టింది. రోడ్డు కనెక్టివిటీలో భాగంగా క్లిష్టమైన వంతెనలు, సొరంగ మార్గాలు నిర్మిస్తున్నాం. జోజిలా పాస్ టన్నెల్ వంటి నిర్మాణాలను చేపట్టాం. సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మించనున్నాం. నాగ్పుర్ నుంచి విజయవాడ కారిడార్ చేపట్టాం. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రోడ్డు కనెక్టివిటీ మరింత పెరగనుంది. భద్రాచలం, బాసర, మేడారం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తాం. జగిత్యాల-కరీంనగర్ హైవే విస్తరణ పనులను త్వరలోనే చేపడతాం. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఎన్నో ప్రాజెక్టులు చేపట్టాం. అంబర్పేట్లో నిర్మించిన పైవంతెనను ఇవాళే ప్రారంభించు కోనున్నాం. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం. పెట్రోల్ వాహనాలకు బదులుగా విద్యుత్ వాహనాలు ఇంకా పెరగాలి. వీటితో రవాణా ఖర్చు బాగా తగ్గుతుందని నితిన్ గడ్కరీ తెలిపారు. స్మార్ట్ సీటీలు కాదు…స్మార్ట్ విలేజ్లను తీర్చి దిద్దుతున్నామని చెప్పారు. వచ్చే నాలుగేళ్లలో తెలంగాణలో రెండులక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. గ్రీన్ ఎనర్జీ కోసం రాబోయే రోజుల్లో లక్ష కోట్లు- ఖర్చు చేస్తామని చెప్పారు. గడ్చిరోలి జిల్లాలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశామన్నారు. రైతులు ఆత్మహత్యచేసుకున్న విదర్భలో తాము పనిచేశామని చెప్పారు. చీకటి ఉండే చోట వెలుగులు నింపాలన్నారు.
వెనుకబడిన జిల్లాలో అభివృద్ధి కోసం మేం పనిచేస్తున్నాం. అమృత్ సరోవర్ పేరుతో నీటి నిల్వలు పెంచుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే మేం నీటి నిల్వలు పెంచేందుకు సిద్ధం. తెలంగాణలో కూడా అలా నీటి సరస్సులను గుర్తిస్తే మేం అభివృద్ధి చేస్తాం అని గడ్కరీ హామీ ఇచ్చారు. మీ సమస్యలను అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. రోడ్డు బాగుంటేనే అమెరికా ధనిక దేశం అయింది. తెలంగాణలో కూడా రోడ్లు బాగుంటేనే ధనిక రాష్ట్రం అవుతుందన్నారు. నీరు, ఇంధనం, రవాణా, కమ్మునికేషన్, ఏఐతో ఏ ప్రదేశమైనా అభివృద్ధి జరుగుతోంది. .శ్రీనగర్, జమ్మూలో36 టన్నెల్స్ నిర్మిస్తున్నాం. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం, ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు ఆదివాసీలతో కలిసి పనిచేశాం. యువకులకు ఉద్యోగాలు, రైతులకు మధ్దతు ధర దక్కాలి. జగిత్యాల వరంగల్ హైవేకు రూ.1000 కోట్లు- కేటాయించాం అని నితిన్ గడ్కరీ అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, ఎంపీ గోడం నగేశ్, వంశీ, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, పాల్వాయి హరీశ్ తదితరులు పాల్గొన్నారు.