కాశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకు రోడ్డు కనెక్టివిటీ

•హైవేల విస్తరణతో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి
•కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌,‌ప్రజాతంత్ర,మే5: కశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీనే లక్ష్యమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో రూ. 3,694.4 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు జరిగాయని, హైవేల విస్తరణ వల్ల రోడ్డు ప్రమదాలు తగ్గాయని.. సమయం తగ్గిందని అన్నారు. తెలంగాణలో హైవేల నిర్మాణ పనులకు…కేంద్రం రూ. 1.25 లక్షల కోట్లు కేటాయించిందని తెలిపారు. రోడ్డు, రైల్వే, విమాన కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. హైవేల విస్తీర్ణం 5 వేల కిలోమీటర్లు దాటిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గడ్కరీతో కలిసి ఆయన కాగజ్‌నగర్‌ ‌సభలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ.. కశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీని పెంచడం మోదీ సర్కార్‌ ‌లక్ష్యమని అన్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణం 5వేల కి.మీ దాటిందని చెప్పారు. జాతీయ రహదారుల విస్తరణ వల్ల రోడ్డు ప్రమాదాలు, ప్రయాణ సమయం భారీగా తగ్గాయి. రోడ్డు, రైల్వే, విమాన కనెక్టివిటీ పెంచేందుకు కేంద్రం అంకితభావంతో పనిచేస్తోంది.

దేశవ్యాప్తంగా 7 టెక్స్‌ట్కెల్‌ ‌పార్కులు మంజూరు చేస్తే తెలంగాణకు కూడా ఒకటి దక్కింది. రూ.6,330 కోట్లతో రామగుండంలో యూరియా ఉత్పత్తి పరిశ్రమను పునరుద్ధరించుకున్నాం. ఇచ్చిన హావిరీ ప్రకారం నిజామాబాద్‌ ‌జిల్లాకు పసుపు బోర్డు మంజూరు చేశాం. ఆదిలాబాద్‌లో డిఫెన్స్ ఎయిర్‌పోర్టు ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా రేషన్‌ ‌బియ్యాన్ని మోదీ ప్రభుత్వం అందజేస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page