హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 3 : శ్రీకాంతాచారి అమరత్వం గొప్పదని, ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ప్రజలు ఎప్పటీకి మరువరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ, కేసీఆర్ అరెస్టును చూసి తట్టుకోలేకపోయిన శ్రీకాంతాచారి అగ్నికి అహుతి అయ్యి అమరుడయ్యారని చెప్పారు.
ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిందన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఎక్స్ వేదికగా జోహార్లు అర్పించారు. ‘శ్రీకాంతాచారి అమరత్వం గొప్పది. ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ప్రజలు ఎప్పటీకి మరువరు. తెలంగాణ ఉద్యమకారులపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ, కేసీఆర్ అరెస్ట్ ను చూసి తట్టుకోలేకపోయిన శ్రీకాంతాచారి అగ్నికి అహుతి అయ్యి అమరుడయ్యాడు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగం తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయనకు జోహార్లు అర్పిస్తున్నాను. జోహార్ శ్రీకాంతాచారి! జై తెలంగాణ.’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.