ఎల్క‌తుర్తి స‌భ‌లో మ‌హిళ‌ల‌కు ప్రత్యేక ఏర్పాట్లు

– ఈ మేర‌కు బీఆర్ఎస్ అధినేత నాయ‌కుల‌కు దిశా నిర్దేశం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 18: ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో జరుగనున్న పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో, సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల‌ని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నాయ‌కుల‌కు సూచించారు. శుక్ర‌వారం కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం పార్టీ నాయ‌కుల‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. సభ విజయవంతంలో మ‌హిళ‌ల భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన తగిన సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,  మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడితెల సతీష్ కుమార్, పార్టీ మహిళా నేతలు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, టీఎస్‌పీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రా తనోబా, గిడ్డంగుల శాఖ మాజీ ఛైర్పర్సన్ రజినీ సాయిచంద్, నవీనాచారి, పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గాదరి బాలమల్లు, కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page