తవ్వి వదిలేసిన రోడ్డు

‘‘సరూర్‌ ‌నగర్‌ ‌బస్‌ ‌స్టాప్‌ ‌పక్క వీధిలో గత రెండు నెలల క్రితం తవ్వి వదిలేసిన రోడ్డు. నడవలేక ప్రమాదాల పాలవుతున్న వ్రద్ధులు, వికలాంగులు, ద్విచక్ర వాహన దారులు. ఎన్ని సార్లు ఫోన్‌ ‌చేసి నా స్పందించని కార్పొరేటర్‌/‌మున్సిపల్‌ అధికారులు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం అప్రమత్తమై త్వరితగతిన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నాం..’’

 

పబ్లిక్‌ ‌గార్డెన్స్ ‌వారసత్వ రత్నాల పునర్నిర్మాణం, పునఃప్రారంభం అవసరం

పబ్లిక్‌ ‌గార్డెన్స్, ‌లేదా బాఘ్‌-ఎ-ఆమ్‌, 1846‌లో 7వ నిజాం చేత నిర్మించబడిన హైదరాబాదు పురాతనమైన ప్రజా పార్క్. ‌నగర మధ్యంలో ఉన్న నాంపల్లిలో ఇది తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియం, జవహర్‌ ‌బాల్‌ ‌భవన్‌, ‌జూబిలీ హాల్‌ ‌మరియు శాసన సభ భవనాలను కలిగి ఉంది. ఒకప్పుడు ఇది విద్య మరియు వినోదానికి కేంద్రంగా వర్థిల్లింది, ఇప్పుడు గత గౌరవాన్ని కోల్పోయిన నిర్లక్ష్య పరిస్థితిలో ఉంది.

పక్కనే ఉన్న వైఎస్‌ఆర్‌ ‌పురావస్తు మ్యూజియం తన ఘనమైన ఇండో-సారసెనిక్‌ ‌శైలిలో నిర్మాణంతో, అరుదైన పురావస్తు వస్తువులతో ఇప్పుడు పరిపాలనా అశ్రద్ధ వల్ల ధ్వంసమవుతోంది. నిజాం కాలంలో నాటిన వందల ఏళ్ల పాత చెట్లు మరియు అమూల్య ప్రదర్శన వస్తువులు మాయమయ్యే ప్రమాదంలో ఉన్నాయి. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభత్వం వెంటనే జూబిలీ హాల్‌, ‌జవహర్‌ ‌బాల్‌ ‌భవన్‌ ‌మరియు హెల్త్ ‌మ్యూజియంలను పునఃప్రారంభించేందుకు నిధులు విడుదల చేయాలి. .


– మోహమ్మద్‌ ఆబిద్‌ అలీ, వారసత్వ మరియు సామాజిక కార్యకర్త

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page