తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగు బంధం

  • మాజీ మంత్రి హ‌రీష్‌రావు
  • సిద్దిపేట నుంచి వ‌రంగ‌ల్‌కు విద్యార్థుల పాద‌యాత్ర

సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 25: తెలంగాణ ఉద్య‌మానికి సిద్దిపేట‌కు పేగు బంధమ‌ని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే హ‌రీష్ రావు అన్నారు. సిద్దిపేట (Siddipet)  నియోజకవర్గం కేంద్రం రంగదాం పల్లి అమర వీరుల స్థూపం నుంచి వరంగల్ సభ వద్దకు వెయ్యి మంది విద్యార్థి, యువత పాదయాత్రను హరీష్‌రావు శుక్ర‌వారం ప్రారంభించారు. కాశ్మీర్ పెహల్గంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటిద్దాం. అంత‌కుముందు కాశ్మీర్ పెహల్గంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు..

ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ పాదయాత్ర రేపటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి విజయ యాత్రగా కాబోతున్నదని అన్నారు. నాడు సిద్దిపేట నుంచే కేసీఆర్ సైకిల్ యాత్ర చేపట్టి వరంగల్ సభకు ఊళ్లకు ఊళ్లు కదిలించారని, చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి కానీ బిఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడిందని కేసీఆర్ అనే ఒక గొంతు కోట్ల గొంతుకలను ఏకం చేసిందని తెలిపారు. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల ప్రభుత్వం ఇప్పుడు ఏడాదిన్నర ప్రతిపక్షం. ఏ పాత్ర అయినా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ పక్షం. లంకలో రావణుడి అరాచకాలను అరికట్టడానికి ఆనాడు రామదండు కదిలింది. నేడు మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదిరించడానికి ఈ గులాబీ దండు కదిలింది. సిద్దిపేట నియోజకవర్గం కేంద్రం రంగదాం పల్లి అమరవీరుల స్థూపం నుంచి వరంగల్ సభ వద్దకు వెయ్యి మంది విద్యార్థి, యువత పాదయాత్ర చేపట్టార‌ని చెప్పారు. 44 డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా 1500 మంది 27వ తేదీన వరంగల్ లో జరగబోయే పార్టీ రజతోత్సవం కోసం స్వచ్ఛందంగా తరలివచ్చిన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు అవినావాభావ సంబంధం ఉంది.


నాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కైనా, 2001లో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైన సందర్భమైన సిద్దిపేటకు పేగు బంధం ఉంది. మీరు చేస్తున్న ఈ పాదయాత్ర రేపటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి విజయ యాత్రగా కాబోతున్నది. బిఆర్ఎస్ పార్టీ పుట్టిన నాడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. గాలి బుడగ లాంటిది పాలపొంగు లాంటిదని అమాసకు పుట్టింది పున్నానికి పోతది అని కూడా అన్నారు. మనల్ని అన్న వాళ్లు ఆగమయ్యారు తప్ప టిఆర్ఎస్ పార్టీ ఆగం కాలేదు. చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి కానీ బిఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా చరిత్రలో నిలిచింది. కేసీఆర్ నాయకత్వంలో అంబేద్కర్, గాంధీల మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. కెసిఆర్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రజలందరికీ తెలంగాణ ఎందుకు అవసరమో బోధించారు. సమైక్యవాదులపై, దిల్లీ పెద్దలపై పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించారు.

1969లో చాలామంది అమరులయ్యారు. ఎంతోమంది విద్యార్థులు మరణించారు. పోలీస్ కాల్పుల్లో 369 మంది చనిపోయారు. ఆనాటి హింసను దృష్టిలో పెట్టుకొని మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గాంధీ చూపిన బాటలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపారు. 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల ప్రభుత్వం ఇప్పుడు ఏడాదిన్నర ప్రతిపక్షం. ఏ పాత్ర అయినా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ పక్షం. రాష్ట్ర సాధన కోసం, మన ఆత్మగౌరవం కోసం 14 ఏళ్లు పోరాటం చేసాం. పదేండ్ల టిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి సంక్షేమాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపాము. ధాన్యం ఉత్పత్తిలో, తలసరి ఆదాయంలో, జిఎస్డిపిలో తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపాము. అంతేకాదు డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నెంబర్ వన్. తెలంగాణ రాష్ట్రం ప్రారంభించిన పథకాలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.

కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది, కాంగ్రెస్ చెప్పిన మోసపూరిత మాటలు, అబద్ధపు హామీలు ప్రజలకు అర్థమయ్యాయి. ఓడినా, గెలిచినా ప్రజల పక్షాన, ప్రజల మధ్యలో ఉండి కొట్లాడే పార్టీ బిఆర్ఎస్ మాత్రమే.
ఈరోజు ఈ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు కావాలి. ఆరోజు లంకలో రావణుడు చేసే అరాచకాలను ఎదిరించడానికి రామదండు కదిలింది. అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదిరించడానికి ఈ గులాబీ దండు కదిలింది. మూడు రోజులపాటు 70 కిలోమీటర్లు పాదయాత్ర చేసి గులాబీ దండు రజితోత్సవ సభను విజయవంతం చేయడానికి కదిలింది. పాదయాత్ర విజయవంతం చేయడానికి అందరూ క్రమశిక్షణతో ట్రాఫిక్ ఇబ్బందులు జరగకుండా నడవాలని హ‌రీష్ రావు సూచించారు. ఎవరికి చిన్న ప్రమాదం కానీ గాయం కాకుండా అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. పాదయాత్రలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను వివరించాల‌ని సూచించారు.

ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రి భోజన సమయంలో మిమ్మల్ని కలుసుకుంటాన‌ని చెప్పారు. గ్రామాల వారీగా, మండలాల వారీగా, పట్నాల వారీగా టీములు క్రమశిక్షణతో ముందుకు సాగాల‌ని సూచించారు. విద్యార్థులు, యువ‌త చేస్తున్న పాద‌యాత్ర‌కు అన్ని వసతులను ఏర్పాటు చేస్తామ‌ని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటామ‌ని హ‌రీష్ రావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page