– యూపీలో నెట్వర్క్ను ఛేదించిన పోలీసులు
– పదిమంది నిందితుల అరెస్ట్.. ముమ్మర దర్యాప్తు
లక్నో, మే 19 : నాసిక్లోని ఓ బహుళజాతి కంపెనీలో బలవంతపు మత మార్పిళ్లు, లైంగిక వేధింపులు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అటువంటి మరో ఘటన ఉత్తర్ప్రదేశ్లోని విÖర్జాపుర్లో వెలుగులోకి వచ్చింది. జిమ్లలో చేరే మహిళలను లక్ష్యంగా చేసుకుని మత మార్పిళ్లు చేస్తున్న నెట్వర్క్ను పోలీసులు గుర్తించారు. విÖర్జాపుర్లోని ఓ జిమ్ యజమాని మతం మారాలని బలవంతం చేస్తున్నట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై విచారణ చేస్తుండగా దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించారు. నిందితులు రాష్ట్రంలోని వివిధ జిమ్లు, సోషల్విÖడియాల్లో ముందుగా మహిళలతో పరిచయాలు పెంచుకుని అనంతరం మత మార్పిడి చేసుకోవాలని వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. 50 మందికిపైగా మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సన్నో అనే మహిళ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ముందుగా జిమ్లలో చేరి అక్కడి యువతులతో పరిచయం పెంచుకుంటుందని, అనంతరం తన స్నేహితులుగా పేర్కొంటూ పలువురు ముస్లిం యువకులను వారికి పరిచయం చేస్తుందని పేర్కొన్నారు. మరికొందరు మహిళలను నిందితులు ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ల ద్వారా పరిచయం పెంచుకుని వారిలో మతమార్పిడి ఆలోచనలు కలిగేలా బ్రెయిన్ వాష్ చేసేవారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లలో వందలాదిమంది మహిళల ఫొటోలు, వీడియోలు, చాట్లు ఉన్నాయని, వాటిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ కేసు యÖపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. నిందితులపై గ్యాంగ్స్టర్ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటివరకు పదిమంది అనుమానితులను అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

