తక్కువ ఖర్చు కాగ‌ల‌ ప్రత్యామ్నాయాలు పరిశీలించాం

– ప్రాణహిత-చేవెళ్ల’పై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును సాంకేతికంగా, ఆర్థికంగా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాలను పరిశీలించినట్లు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై సచివాలయంలో సోమవారం జరిగిన వివరణాత్మక సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి సుందిళ్ల లింక్‌ ద్వారా సవరించిన సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం అధ్యయనం చేసిందని, ఇది ప్రాజెక్టు వ్యయాన్ని దాదాపు 10 నుండి 12 శాతం తగ్గిస్తుందని, భూసేకరణను దాదాపు సగానికి తగ్గిస్తుందని, మునుపటి ప్రణాళికలతో పోలిస్తే సుమారు రూ.1,500 నుండి 1,600 కోట్లు ఆదా చేస్తుందని చెప్పారు. తెలంగాణలోని ఎత్తైన ప్రాంతాలు, కరవు పీడిత ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకురావాలనే అసలు లక్ష్యాన్ని నెరవేర్చడంతోపాటు, సాంకేతిక దృఢత్వం, ఆర్థిక వివేకం, పర్యావరణ బాధ్యతను నిర్ధారించే విధంగా దీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును పునర్నిర్మించడమే ప్రభుత్వ విస్తృత ఉద్దేశమని వివరించారు. సవరించిన సుందిళ్ల లింక్‌ ఆచరణాత్మక, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా పరిశీలించామని చెప్పారు. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటూనే బొగ్గు నిల్వ నిర్మాణాలకు సంబంధించిన మునుపటి సవాళ్లను పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని భావించి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page