రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదు
సీఎం మాటలు రాష్ట్ర భవిష్యత్కు శాపం పెట్టినట్లు ఉన్నాయి
పరిపాలన చేతగాక కాడి కింద పడేశాడు
అడ్డగోలు వ్యాఖ్యలు మాని సంపద పెంచే ఆలోచన చేయాలి
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
దరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : పరిపాలన అంటే బజారు భాష మాట్లాడినంత ఈజీ కాదని, ఒకవైపు సీఎం రేవంత్ దివాలా మాటలు మాట్లాడుతూ మరోవైపు తెలంగాణ రైజింగ్ అంటున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేసేటందుకు పైసలు లేవు కానీ..అందాల పోటీలకు నిర్వహించేందుకు పైసలుంటాయా? అని ఆయన ప్రశ్నించారు. పరిపాలన చేతగాక పోతే తప్పుకోవాలని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తిడతామంటే, కేసీఆర్ను దూషిస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ భవన్ లో మంగళవారం మీడియా సమావేశంలో కెటిఆర్ ఫైర్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే.. అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. ఉద్యోగుల త్యాగాలపై ఎన్నో మాట్లాడిన రేవంత్ ఇప్పుడెలా మాట్లాడుతున్నాడు? ఉద్యమంలో కదం తొక్కిన ఉద్యోగులను సీఎం రేవంత్రెడ్డి అవమానిస్తున్నారు.ఉద్యోగులకు, ప్రజలకు మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే ఇవాళ ఉద్యోగులు అడుగుతున్నారు.
రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు పైసలు లేవా?
కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్న కరెంట్, తాగునీళ్లు ఇప్పుడెందుకు రావడంలేదు? ఆదాయం పెరిగిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టాం. మొదట శ్వేతపత్రం పెట్టినప్పుడు బీఆర్ఎస్ రూ.6 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. ఇప్పుడేమో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8.50 లక్షల కోట్ల అప్పు చేసిందంటున్నారు, రేవంత్రెడ్డి సర్కార్ నడుపుతున్నారా.. సర్కస్ నడుపుతున్నారా? కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రానికి రూపాయి కూడా ఆదాయం పెంచలేకపోయింది. కాంగ్రెస్ సర్కార్ నెలకు రూ.2 వేల కోట్ల అప్పులు మాత్రమే చెల్లిస్తోంది. మరో పదేళ్లలో ఏడాది వరకు రూ.2.67 కోట్లు మాత్రమే. అప్పుల్లో తెలంగాణ 28వ స్థానంలో ఉందని పార్లమెంటులో కేంద్రమే చెప్పింది. గడిచిన పదేళ్లలో తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్. కిరణ్కుమార్రెడ్డి మాకు రాష్ట్రాన్ని అప్పగించినప్పుడు 12వ స్థానంలో ఉండేది. బంగారు తెలంగాణను 17 నెలల పాలనలోనే అస్తవ్యస్తం చేశారన్నారు.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో 2023-24లో 14,295 కోట్ల ఆదాయం ఉండగా,. 2024-25 ఏడాదికి రూ.14 వేల కోట్లు మాత్రమే వొచ్చింది. హైడ్రా పేరుతో పేదవాడి కడుపు మీద కొట్టారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారని స్వయాన ప్రధాని అన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని ఎవరన్నా బజారున పెట్టుకుంటారా? ఈ ప్రభుత్వ నిర్వాకం ఎట్లుందంటే రూ.170 కోట్ల లంచం ఇచ్చి.. ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి పైసలు తెచ్చుకునే దుస్థితి వొచ్చింది. దిల్లీకిపోతే అపాయింట్మెంట్ ఇస్తలేరని అంటున్నారు.
43సార్లు దిల్లీకి పోతే రూ.43 కూడా తీసుకురాలేదు. రేవంత్రెడ్డి దిల్లీ ట్రిప్ ఫోటోలన్నీ బయటపెడతామని కేటీఆర్ అన్నారు. 17 నెలల్లో రేవంత్ పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెలికాఫ్టర్ల కోసం ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారు. ప్రజలు ఇచ్చిన హామీలను అడగొద్దని రేవంత్రెడ్డి అంటున్నాడు. రేవంత్రెడ్డి పెట్రోల్ ధర రూ.200 చేస్తానంటున్నాడు. అడ్డగోలు వ్యాఖ్యలు మాని సంపద పెంచే ఆలోచన చేయాలి కేసీఆర్ చావును నిరంతరం రేవంత్ కోరుకుంటున్నాడు. పాలన చేతగాని రేవంత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు. పరిపాలన చేతగాక పోతే తప్పుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.