అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది తాను కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసలు నిజాన్ని బయటపెట్టారు. గత నెలలో రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధాన్ని తానే ఆపించానని డొనాల్డ్ ట్రంప్ అప్పట్లో ప్రకటించారు. ఆయన ఏ దేశానికి వెళ్లినా అదే మాట చెబుతూ ఆ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. ఇదిలావుండగా ట్రంప్ ప్రకనటపై తాజాగా స్పందించిన భారత ప్రధాని మోదీ కాల్పుల విరమణలో అమెరికా ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ట్రంప్తో కూడా మోదీ మాట్లాడినట్టు ప్రకటన వెలువడిరది. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్కు ట్రంప్ విందు ఇచ్చారు. విందు అనంతరం ఓవల్ ఆఫీస్లో వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. ఆ సమావేశంలో ట్రంప్ అసలు నిజాన్ని వెల్లడిరచారు. ‘భారత్-పాకిస్థాన్ అధినేతలు యుద్ధాన్ని కొనసాగించకూడదని తెలివైన నిర్ణయం తీసుకున్నారు.. రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం మంచిది కాదు’ అని ట్రంప్ పేర్కొన్నారు. గత నెలలో ఇండియా-పాక్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీస్తాయని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భయపడిన విషయం విదితమే. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపడంలో తన పాత్ర గురించి ట్రంప్ చెప్పుకోకపోవడం ఇదే తొలిసారి. అలాగే భారత్, పాకిస్థాన్లతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నట్టు కూడా ట్రంప్ ఈ సమావేశంలో వెల్లడిరచారు. కాగా, తమ వ్యవహారాల్లో ఇతరులు జోక్యాన్ని భారత్ ఎప్పటికీ అంగీకరించదని భారత ప్రధాని మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని తాను స్వయంగా ట్రంప్నకు కూడా ఫోన్లో చెప్పానని మోదీ తెలిపారు.