- ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం
- మంత్రి పొన్నంప్రభాకర్ గౌడ్
హుస్నాబాద్, ప్రజాతంత్ర, మే 2 : హుస్నాబాద్ లో ఈనెల 12 నుంచి జూన్ 11 వరకు రేణుకా ఎల్లమ్మ (Renuka Ellamma) తల్లి అమ్మవారి ఉత్సవాలు మరింత ఘనంగా జరుపుకోవాలని రవాణా, బీస సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ లో రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవాలపై మంత్రి పొన్నంప్రభాకర్ (Minister Ponnam Prabhakar Goud) శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. త్వరలోనే అమ్మవారి కమిటీ వేస్తామన్నారు.
అమ్మవారి ఆలయానికి ప్రహరీ ఏర్పాటు చేశామని, స్థపతి ప్రకారం ఆలయం అభివృద్ధి చేస్తామన్నారు. అమ్మవారికి వెండి తొడుగు ఏర్పాటు చేశాం. పోలీసులు క్రౌడ్ మేనేజ్మెంట్ చూసుకోవాలి. భక్తులు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. శానిటేషన్ మున్సిపల్ సిబ్బంది చూసుకోవాలి. ప్రోటోకాల్ ఎండోన్మెంట్ చూసుకోవాలి. ఉత్సవాల సమయంలో మీ ఇళ్లలో దావత్ లు చేసుకొని బంధువులను పిలుచుకోవాలి. హుస్నాబాద్ ఎల్లమ్మకి అందరూ బోనాలు చేస్తారు.. ఇది ఒక కులానికి పరిమితమైన దేవాలయం కాదు. జాతరలో వొచ్చే షాప్స్ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. వాహనాలు కచ్చితంగా పార్కింగ్ లోనే పెట్టాలి. 5 కోట్లతో రోడ్డు మంజూరైంది. వెనకాల ఆరు గెస్ట్ రూంలు ఉన్నాయి పూర్తి చేస్తామన్నారు పురాతన పోచమ్మ ఆలయం కూడా స్థపతి ప్రకారం నిర్మిస్తామని, హుస్నాబాద్ నుండి మే 12 నుండి జూన్11 వరకు జరిగే ఉత్సవాల్లో అందరు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు.
స్థానికులు ఆతిథ్యం ఇచ్చే వారిగా ఉండాలి. అతిథుల ముందు అగౌరవపరిచుకోవద్దు. అధికారులు సమన్వయం చేసుకోవాలి. రాష్ట్రంలో ముఖ్యమైన వారంతా ఇక్కడకి వచ్చేలా చేస్తా.. హుస్నాబాద్ లో ఉన్న ప్రతి గడప చుట్టాలు పిలుచుకొని అమ్మవారికి బోనం సమర్పించాలి. ఆలయం అభివృద్ధి ,కాంపౌండ్ వాల్ , రూమ్స్,షాప్స్ ,వాటర్ ప్లాంట్ అన్నీ వస్తున్నాయి. దేవాలయ అభివృద్ధికి 9 కోట్లతో ప్రతిపాదనలు చేయబడ్డాయి. పాత ఆలయం స్థపతి ప్రకారం అభివృద్ధి చేస్తాం జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం ,బల్కంపేట ఎల్లమ్మ ఆలయం మాదిరిగా ఇక్కడ అభివృద్ధి చేస్తాం. మూడు బ్యాంకెట్ హాల్స్ ఏర్పాటు చేసి ఇక్కడ ఫంక్షన్ లు ఏర్పాటు చేసుకునేలా చేస్తామని మంత్రి పొన్నం తెలిపారు.