అన్నవరం దేవేందర్‌తో  ‘కవిసంధి’

మే25వ తేదీ ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు కరీంనగర్‌లోని ఫిల్మ్‌భవన్‌ ఏసి హాల్‌లో ప్రముఖకవి అన్నవరం దేవేందర్‌ ‘కవి సంధి’ కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర సాహిత్య అకాడమీ  ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో తన సాహిత్య జీవన యాత్రను అన్నవరం దేవేందర్‌ వివరించి కవితా పఠనం చేస్తారు. అనంతరం ప్రశ్నలు, సమాధానాల సెషన్‌ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు ప్రసేన్‌ పర్యవేక్షిస్తారు.

-డాక్టర్‌ సి. మృణాళిని
కన్వీనర్‌, తెలుగు సలహా మండలి, సాహిత్య అకాడమీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page