హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్24: హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో ఏకంగా 13 మంది హవాలా ఆపరేటర్లపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, గతంలోనూ దేశవ్యాప్తంగా హవాలా వ్యాపారులపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్లీ, జైపూర్, బెంగాల్, కోల్కతాలోనూ దాడులు చేశారు. తనిఖీల్లో భారీ మొత్తంలో హవాలా డబ్బుని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు
