హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌24: ‌హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో ఏకంగా 13 మంది హవాలా ఆపరేటర్లపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, గతంలోనూ దేశవ్యాప్తంగా హవాలా వ్యాపారులపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్లీ, జైపూర్‌, ‌బెంగాల్‌, ‌కోల్‌కతాలోనూ దాడులు చేశారు. తనిఖీల్లో భారీ మొత్తంలో హవాలా డబ్బుని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page