˜16000 మెగావాట్లకు చేరువయ్యే అవకాశం
˜ముందస్తుగానే పెరిగిపోయిన కరెంట్ వినియోగం
˜డిమాండ్ ఎంత పెరిగిన సరఫరా చేస్తామన్న
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : వేసవి, యా సంగి పంటల ప్రభావంతో రాష్ట్రంలో భారీగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగి పోతోంది. గతేడాది మార్చిలో వొచ్చిన అత్యధిక డిమాండ్లు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తెలంగాణ విద్యుత్ సంస్థలు ఎదుర్కొంటున్నాయి. గత ఏడాది మార్చిలో ఏర్పడిన రికార్డు స్థాయి అత్యధిక డిమా ండ్ 15,623 మెగావాట్లు. కానీ ఈనెల 7న 15,920 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడిరది.
అయినప్పటికీ ఎలాంటి సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ ను పంపిణీ సంస్థలు అందిస్తున్నాయి. డిమాండ్ ఎంతగా పెరిగిన దానికి తగ్గట్టుగా సరఫరా చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరింతగా డిమాండ్ పెరుగనున్న నేపథ్యంలో మంగళవారం విద్యుత్ సంస్థల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.