– అవసరమైన ఖర్చు భరిస్తామని హామీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12: స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్-2తో బాధపడుతున్న బేబీ ఆర్యాంశ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. చిన్నారికి ఉత్తమ వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్యాంశ్ చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి సహాయం అందిస్తామని చెప్పారు. తెలంగాణకు చెందిన ఏడాది వయసున్న ఆర్యాంశ్ ప్రాణాలను కాపాడేందుకు ఇంజెక్షన్కు రూ.1.5 కోట్లు అవసరం. జూన్ 20లోపు ఇంజెక్షన్ స్లాట్ను బుక్ చేసుకోవాలని, జులై నెలాఖరులోగా చికిత్స పూర్తిచేయాలని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. దీంతో ప్రజల సహకారంతో ఇప్పటివరకు రూ.75 లక్షలను తల్లిదండ్రులు సేకరించారు. మరో రూ.75 లక్షలు కావాల్సి ఉండగా.. ఆ నిధుల సకరణకు ప్రభుత్వ సాయంపై ఆశలు పెట్టుకున్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి, కావాల్సిన నిధులపై యూట్యూబర్ ఆదిరెడ్డి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆదిరెడ్డి పోస్ట్కు సీఎం వెంటనే స్పందించారు. ’చిన్నారికి ఉత్తమ చికిత్స అందేలా చేస్తాం. సీఎంఆర్ఎఫ్ అధికారులు.. ఆ చిన్నారి తల్లిదండ్రులను సంప్రదిస్తారు. ఆర్యాంశ్ పూర్తిగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ఎక్స్లో రేవంత్ పోస్ట్ చేశారు. సీఎం ఆదేశాలతో సీఎంఆర్ఎఫ్ అధికారులు తక్షణమే చిన్నారి ఆర్యాంశ్ తల్లిదండ్రులను సంప్రదించనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.