ములుగు ఆలయాల అభివృద్ధికి రూ.1.42 కోట్లు

మంత్రి సీతక్క విజ్ఞప్తితో మంజూరైన నిధులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1: ములుగు నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి సంబంధించి సీజీఎఫ్‌ నిధుల నుంచి రూ.1.42 కోట్లు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. గోవిందరావుపేట మండలం బుస్సాపూర్‌ జానకి రామాలయానికి రూ.12 లక్షలు, కొత్తగూడ మండలం గుంజేడులోని ముసలమ్మ ఆలయానికి రూ.50 లక్షలు, ములుగు మండలం జగ్గన్నపేట పుట్టా మల్లికార్జున స్వామి ఆలయానికి రూ.30 లక్షలు, మల్లంపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.20 లక్షలు, ములుగు పట్టణంలోని నాగేశ్వరస్వామి ఆలయానికి రూ.20 లక్షలు, రామాలయానికి రూ.10 లక్షలు మంజురయ్యాయి. అధికారులు త్వరలో టెండర్లు పిలిచి ఆయా అభివృద్ది పనులను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. తన విజ్ఞప్తికి స్పందించి నిధుల మంజూరుకు సహకరించిన సీఎం రేవంత్‌ రెడ్డి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలకు మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ధనసరి అనసూయ సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page