Category తెలంగాణ

కేరళంలో సీఎం రేవంత్ రోడ్ షో

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: కేరళంలో ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. అక్కడి ఎస్ఎం లాక్ జంక్షన్ నుంచి ముట్టతార వరకు బుధవారం రోడ్ షోలో పాల్గొని స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, పినరయ్ విజయన్‌కు తేడా ఏమీ లేదని, కేరళం ప్రజలు తెలివైన వారు, విద్యాధికులని, …

వేస‌వి మంట భ‌రించాల్సిందే

– మూడు నెలలు ఎండలు, వడగాడ్పులు – భారత వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాష్ట్రంలో ఈ వేసవి సీజన్ మొత్తం ఎండ మంట పుట్టించనుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పగటి ఉష్ఱోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదుకానున్నాయని వాతావరణ వాఖ హెచ్చరించింది. రానున్న మూడు నెలలకు దేశంలో వాతావరణ…

కొత్తగా నమోదు చేసుకున్న రైతులకు ఊరట

–  వారికి కూడా ‘రైతుభరోసా’ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాష్ట్రంలోని కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులకు రేవంత్ సర్కార్ భారీ ఊరటనిచ్చింది. ఇప్పటివరకు పాత లబ్దిదారులకే పరిమితమైన రైతు భరోసా పథకాన్ని కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టా పొందిన రైతులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పట్టా…

రెండు పంచాయతీలకు జాతీయ అవార్డులు 

– హర్షం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క న్యూదిల్లీ, ఏప్రిల్ 1 : గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో విశిష్ట ప్రతిభ కనబరిచిన తెలంగాణ పంచాయతీలకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ’దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు’ రాష్ట్రంలోని రెండు గ్రామ పంచాయతీలను వరించాయి.…

 ‘అనిమేష’కు సాహిత్య అకాడమీ అవార్డు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 31: తెలంగాణ సాంస్కృతిక స్వరానికి ప్రతినిధిగా నిలిచిన ప్రముఖ తెలుగు కవి నందిని సిద్ధా రెడ్డి తన కవితా సంకలనం ‘అనిమేష’కు  ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డు 2025కు ఎంపికయ్యారు. ఈ సంవత్సరం దేశంలోని వివిధ భాషల నుంచి ఎంపికైన 24 మంది రచయితల్లో ఆయన ఒకరు. తెలంగాణ భాషా మాండలికంలో…

ఒంటిపూట పనిచేయనున్న అంగన్వాడి కేంద్రాలు

–  I మేలో వేసవి సెలవులు హైదరాబాద్, మార్చి 31: రాష్ట్రంలోని అంగన్వాడి కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్‌లో అంగన్‌వాడీ కేంద్రాలను ఒంటిపూట పద్ధతిలో నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేసింది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 8 నుంచి…

ఇప్పపూవు సారాకు వేల ఏళ్ల చరిత్ర

– దీనిపై మాట్లాడితే దుష్ప్రచారమా? – మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 31: తను ఇప్పపూవు సారా గురించి చెబితే తనపై  కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆరోపించారు. కల్తీసారా తాగకండి అంటే తనను బద్నాం చేస్తారా అంటూ  ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ…

ఆటో సర్వీసులకు గ్యాస్‌ ‌కొరత

– తక్షణమే సమస్య పరిష్కరించండి – కేంద్ర మంత్రి హరిదీప్‌ ‌సింగ్‌ కి మంత్రి ఉత్తమ్‌ ‌లేఖ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి31: హైదరాబాద్‌లో ఎల్‌పీజీ ఆటోరిక్షాలు ఎదుర్కొంటున్న గ్యాస్‌ ‌కొరతపై కేంద్ర మంత్రి హరిదీప్‌ ‌సింగ్‌ ‌పూరికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారు. ఆటో కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అదనపు…

రాష్ట్రంలో ముదరుతున్న ఎండలు

– సాయంత్రాలు పలుచోట్ల వర్షాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 31:రాష్ట్రంలో ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పగలంతా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాయంత్రం ఆకాశం మేఘాలు కమ్ముకొని ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది.సోమవారం…