Category తెలంగాణ

పంచాయతీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

– రేపటినుంచి సర్పంచులు, కార్యదర్శులు, అధికారులకు శిక్షణ – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : గ్రామ పంచాయతీలే గ్రామాభివృద్ధికి కేంద్ర బిందువని, గ్రామాల అవసరాలను గుర్తించి అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క…

డిఎస్పీ భీమ్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

‌హైదరాబాద్‌,‌ ప్ర‌జాతంత్ర‌, జూలై 7: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ భీమ్‌రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ ‌విధించింది. భారీ ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో ఏకంగా రూ. 300 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను…

రాజ్యాధికారంతోనే విశ్వకర్మల మ‌నుగ‌డ‌

– రాష్ట్ర జనాభాలో నాలుగైదు శాతం ఉన్నా విస్మ‌రిస్తారా? – విప‌క్ష‌నేత‌ మ‌ధుసూద‌నాచారి ధ్వజం – రౌండ్ టేబుల్ స‌మావేశంలో 6 తీర్మానాలు హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 7: విశ్వ‌బ్రాహ్మ‌ణులు ఒక శ‌క్తిగా ఎద‌గాల‌ని, రాజ్యాధికారంలో వాటా చేజిక్కించుకోవాల‌ని శాస‌న‌మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత‌, ఎమ్మెల్సీ సిరికొండ మ‌ధుసూద‌నా చారి పిలుపునిచ్చారు. రాజ్యాధికారంతోనే ఏ కులానికైనా గుర్తింపు,…

పార్టీ పేరు మార్పుపై న్యాయ పోరాటం

– ఈసీ నోటీసులపై దిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్‌ ‌న్యూదిల్లీ, జూలై 7: పార్టీ పేరు మార్చుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులపై కల్వకుంట్ర కవిత దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ  ఖరారుపై కల్వకుంట్ల కవిత దిల్లీ హైకోర్టులో న్యాయ పోరాటానికి దిగారు. తెలంగాణ రక్షణ సమితి పేరు తన పార్టీకి కేటాయించాలని కోరుతూ…

పట్నం, మేడ్చల్‌, ‌మహేశ్వరంలకు మహర్దశ

– రూ.338 కోట్లతో నాలుగు లేన్ల ఆధునిక రహదారులు – నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి  రంగారెడ్డి, ప్రజాతంత్ర,జూలై 7:  ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌, ‌మహేశ్వరం నియోజకవర్గాల్లో హైబ్రిడ్‌ అన్యుటీ మోడల్‌ ‌విధానంలో రూ.338 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆధునిక నాలుగు లేన్ల రహదారుల నిర్మాణ పనులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి…

రెండున్న‌రేళ్ల‌యినా రేవంత్‌కు పాల‌న‌పై ప‌ట్టు లేదు

– 30 నెల‌ల్లోనే 24 సార్లు మేజ‌ర్ బ‌దిలీలు – కుప్ప‌కూలిన రియ‌ల్ ఎస్టేట్ రంగం – బంగ్లాదేశ్‌, రోహింగ్యాల ఓట్లు తొల‌గించాలి – బీజేపీ ఎంపీ ల‌క్ష్మ‌ణ్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 7: అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై కనీస పట్టు సాధించలేకపోయారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు,…

‘కుడా’లో భారీ అవినీతి జరుగుతోంది

–  రాజేందర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి తోడు దొంగలు – ‘కుడా’ స్థలాలను పెద్దలకు కట్టబెట్టే యత్నం వరంగల్, ప్రజాతంత్ర, జూలై 7: కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా’)లో సుమారు రూ.70 కోట్ల అవినీతి జరిగిందని, దేవుడి భూమి అయిదెకరాలను స్టార్ హోటల్‌కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నార అసెంబ్లీలో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌ భాస్కర్…

చిన్నారులే దేశ సంపద

– ఏ చిన్నారీ అంగన్‌వాడి సేవలకు దూరం కావద్దు – మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : చిన్నారులే దేశ సంపద, దేశ భవిషత్తు అని, తెలంగాణ-2047 లక్ష్య సాధనలో నేటి చిన్నారులే కీలక పాత్ర పోషిస్తారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క)…

‘కుడా’ ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో కీలక ముందడుగు

– వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ పరిధిలో 30ఎకరాల భూమి అప్పగింత హనుమకొండ, ప్రజాతంత్ర, జూలై 7 : కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(‘కుడా’) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రక్రియలో భాగంగా వరంగల్, హనుమకొండ నగరాల పరిధిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హనుమకొండ వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ పరిసర ప్రాంతాల్లోని భూములను అభివృద్ధి చేసేందుకు…