Category తెలంగాణ

సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14: తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బీసీ స్టడీ సర్కిల్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్)-2027 ఉచిత శిక్షణ కార్యక్రమానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కోచింగ్ 2026 ఆగస్టు 24 నుంచి 2027 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. మొత్తం 150మంది అభ్యర్థులకు శిక్షణ అందించనుండగా…

వర్షాకాలంలోనూ వేసవి సెగ

– ‘గ్రేటర్’ లో  రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్ – గతేడాది కంటే భారీగా పెరిగిన వినియోగం -» రోజుకు 82 మిలియన్ యూనిట్లకు చేరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 14: ఎండల ప్రభావంతో గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో విద్యుత్‌ ‌డిమాండ్‌ ‌భారీగా నమోదవుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో ఏసీలు, కూలర్ల వాడకం పెరిగిందని విద్యుత్‌శాఖ అధికారులు…

డీజీపీని క‌లిసిన బాక్స‌ర్, డీఎస్పీ నిఖ‌త్ జ‌రీన్‌

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 14: అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన బాక్సింగ్ ఛాంపియన్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు నిర్వహిస్తున్న నిఖత్ జరీన్ డీజీపీ కార్యాలయంలో డీజీపీ సి.వి. ఆనంద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ  ఆనంద్ నిఖత్ జరీన్ సాధించిన విశిష్ట విజయాలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో…

తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కేటాయింపు చరిత్రాత్మకం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూలై 14 : తాడిచర్ల-2 కోల్ బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం సింగరేణికి టెండర్ విధానంలో కాకుండా నామినేషన్ విధానంలో కేటాయించడం చరిత్రాత్మక నిర్ణయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఈ కేటాయింపుతో సింగరేణికి దీర్ఘకాలంలో భారీ స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రూ.వేల…

తోటి వారికి సాయం చేయడమే మానవత్వం

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 14 :అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ శాయంపేట ప్రాంతంలోని స్లమ్ ఏరియా సందర్శించి అక్కడ వలస నివాసులతో, గుడిసెవాసులతో వీధి బాలలతో మాట్లాడి ఆత్మీయ స్పర్శను అందించారు. డ్రాప్ అవుట్ పిల్లలు బడిలో చదువుకోవాలంటూ చదువు విలువ, జీవితం విలువ…

టీజీటెట్‌-‌జూన్‌ 2026 ‌ఫలితాల విడుదల

– ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక నోటిఫికేషన్‌ – 21‌న విడుదల చేస్తామన్న విద్యాశాఖ డైరెక్టర్‌ ‌నికోలస్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 13: ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీటెట్‌-‌జూన్‌ 2026 ‌ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ‌నవీన్‌ ‌నికోలస్‌ ‌విడుదల చేశారు. జూన్‌ 16 ‌నుంచి 22 వరకు కంప్యూటర్‌ ఆధారిత విధానంలో 10 సెషన్లలో…

విద్యార్థుల్లో కులవివక్షను దూరం చేస్తున్నాం

– యంగ్‌ ఇం‌డియా స్కూళ్లతో విద్యాభివృద్ధి – ఎస్సీ కమిషన్‌ ‌చైర్మన్‌ ‌కిషోర్‌ ‌మక్వానాతో సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 13: జాతీయ ఎస్సీ కమిషన్‌ ‌చైర్మన్‌ ‌కిషోర్‌ ‌మక్వానాతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థుల…

అధికారుల సమస్యలపై సత్వర నిర్ణయం తీసుకోండి

– సింగరేణి యాజమాన్యానికి ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు సింగరేణి భవన్, ప్రజాతంత్ర, జూలై 13 : సింగరేణిలో సుమారు 2,200 మంది అధికారులకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కోల్ ఇండియా సంస్థల మాదిరిగా సింగరేణి…

స్వర్ణ పతక విజేత ప్రవల్లికకు సీఎం అభినందనలు

– ఏషియా అండర్-23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పరుగు పందెంలో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13 : చైనాలోని ఒర్డోస్‌లో జరుగుతున్న తొలి ఏషియా అండర్-23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్-2026లో మహిళల 4I400 రిలే పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించిన ప్రవల్లిక నరిమళ్లకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ బిడ్డ ప్రవల్లిక ఆసియా-23 అథ్లెటిక్…