Category ప్రత్యేక వ్యాసాలు

మహిళా రిజర్వేషన్లు అమలు ఎప్పటినుండి ..?

“దశాబ్దాల పాటు మహిళలకు రిజర్వేషన్లు కల్పించే డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ ఆ క్రెడిట్ ఇప్పుడు బిజెపి తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయకుండా.. ఇపుడు చేస్తున్న జనాభా లెక్కల తర్వాతే అమలు చేస్తామనడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నదనే వారూ…

తెలంగాణ పోరులో ప్రొఫెసర్ లింగమూర్తి సార్….

“తెలంగాణ ప్రాంతంలో దిన పత్రిక లేదని వార పత్రికగా,దినపత్రికగా వెలువడిన “ప్రజాతంత్ర పత్రికను ” కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు ప్రోత్సహించారు. తెలంగాణ ఉద్యమ వార్తలకు అధిక ప్రాధాన్యత నిచ్చిన ప్రజాతంత్రకు ప్రొఫెసర్ లింగమూర్తి సహా ఇతర అధ్యాపకులు వందల సంఖ్యలో చందాదారులను చేర్పించారు. తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన తర్వాత కలిసిన ప్రతి సారి పాత…

శ్రీరామ పట్టాభిషేకం, శ్రీమద్రామాయణ ఫలశ్రుతి

“బ్రహ్మ నిర్మితమై, అనేక రత్నాలతో, తేజస్సుతో ప్రకాశిస్తూ, మనువు పూర్వం అభిషిక్తుడైన సమయంలో ధరించినదై, అది మొదలు వంశపారంపర్యంగా పట్టాభిషేక సమయంలో ధరించేదైన, వెలలేని మణులతో ప్రకాశిస్తున్న కిరీటాన్ని రత్న పీఠంమీద కూచున్న రామవిభుడి అంగీకారంతో వేదాధ్యయనపరులైన ఋత్విజులతో కలిసి వసిష్టుడు అలంకరించాడు. శత్రుఘ్నుడు శ్వేతఛ్చత్రం పట్టాడు. తెల్లటి చామరాన్ని సుగ్రీవుడు, మరొక చామరాన్ని విభీషణుడు…

నారీ శక్తికి పట్టాభిషేకం! భారత పార్లమెంటులో చారిత్రక ప్రజాస్వామ్య విప్లవం

“2029 ఎన్నికలు భారత పార్లమెంటును ఒక సరికొత్త ‘నారీ శక్తి’ వేదికగా మార్చబోతున్నాయి. తెరపై కనిపించే గణాంకాల కంటే, విధాన నిర్ణయాల్లో మహిళలు పోషించబోయే క్రియాశీలక పాత్ర దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. సామాజిక సమస్యల పట్ల మహిళలకు ఉండే సహజమైన సున్నితత్వం, జవాబుదారీతనం చట్టసభల పనితీరును మరింత మెరుగుపరుస్తాయని ఆశించవచ్చు. రాజకీయ సంకల్పం, పారదర్శకమైన అమలు…

ఘాటైన విమర్శలు, వేడైన చురకలే యం యస్ ఆచార్య పరిచయం

“తాను సంపాదకత్వం నిర్వహించే జనధర్మ, వరంగల్‌ వాణి పత్రికల్లోని ఆయన సంపాదకీయ రచనలనిండా వ్యాపించి కన్పించే వ్యక్తిత్వ స్వరూపమే వేరు. అక్కడ ఏ అక్షరంలోనూ దైన్యం ఉండదు. అసామాన్యంగా సామాన్యత్వం ప్రస్ఫుటమపుతుంది. ఋజుత్వం కొట్టవచ్చినట్టు కన్పిస్తుంది.  అసిధారావ్రతంగా సాగిన శ్రీ ఆచార్య సంపాదక రచనలు లలిత పదవిన్యాసంతో సాగుతూనే, పదునుగా, భావ గాంభీర్యంతో, బిగువయిన రచనా…

ప్రతి ఇంటికి ఐఐటీ కలలను సాకారం చేసిన గురువు

“ప్రస్తుతం 101 సంవత్సరాల వయస్సులో ఆయన పడకగదికే పరిమితమైనా, ఆలోచనా శక్తి మాత్రం తగ్గలేదు. రోజూ వార్తలు, భక్తి కార్యక్రమాలు వీక్షిస్తూ, ప్రస్తుత విద్యా విధానం, పాఠ్యాంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.” స్వాతంత్య్ర  సమరయోధుడు, దూరదృష్టి గల ఉపాధ్యాయుడు, ప్రఖ్యాత విద్యావేత్త   చుక్కా రామయ్య, “ఐఐటీ రామయ్య”గా ప్రసిద్ధి చెందారు. దేశంలోనే అత్యంత కఠినమైన ఇంజనీరింగ్…

గడప గడపకూ వచ్చి హామీలిచ్చారు.. గద్దెనెక్కాక పేదవాడిని విస్మరించారు!

  “అధికారంలోకి రాకముందు ‘ప్రజా ప్రభుత్వం’ అంటూ ప్రగల్భాలు పలికిన పాలకులు, తీరా గద్దెనెక్కిన తర్వాత ప్రజల ప్రాథమిక అవసరాలను విస్మరించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. ఒకవైపు భారీ ప్రాజెక్టుల పేరుతో, మరోవైపు అనవసరపు హంగుల కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని ధారపోస్తున్న ప్రభుత్వం, పేదవాడి సొంతింటికి వచ్చేసరికి మాత్రం ‘ఆర్థిక క్రమశిక్షణ’ ముసుగులో నిధుల…

ప్ర‌జ‌ల‌కే బ‌ల‌మైన విప్ల‌వ‌శ‌క్తిని నిర్మిచే శ‌క్తి!

“గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ విధానాలు క్రమంగా వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థల నియంత్రణలోకి తీసుకువచ్చేలా మారుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 83.5 శాతం గ్రామీణ కుటుంబాల వద్ద 1 హెక్టారు కంటే తక్కువ భూమి ఉన్నది. దీంతో కొందరి వద్దనే భూమి కేంద్రీకరణ పెరిగి, ఉపాధి లేమితో ప్రజలు వలసపోతున్నారు.రైతు ఉద్యమం కేవలం చట్టాల రద్దుకు మాత్రమే…

బడ్జెట్ లో విద్యకు లోపించిన రాజకీయ సంకల్పం… సామాజిక న్యాయానికి విఘాతం!!

“తెలంగాణ విద్యా వ్యవస్థ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు మౌలిక వసతుల కొరతతో సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 24,692 పాఠశాలల్లో కేవలం 5,228 పాఠశాలలకే ఐదు తరగతి గదులు ఉన్నాయి. 2,582 పాఠశాలలు ఒక్క తరగతి గదితోనే నడుస్తుండగా, 5,697 పాఠశాలల్లో కేవలం…