ప్రజాగ్రహానికి ఆజ్యం పోస్తున్న ఇథనాల్!

ఇది రాస్తున్న సమయానికి నిర్మల్ జిల్లాలో నిర్మల్ – భైంసా జాతీయ రహదారి మీద దిలావర్ పూర్ లో రైతుల, ముఖ్యంగా మహిళల రాస్తారోకో ఆందోళన అనంతర పరిణామాలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం ప్రారంభమయిన ఆందోళన బుధవారం ఉదయానికి కూడా కొనసాగింది. వేలాది మంది దిలావర్ పూర్, గుండంపల్లి, సమందర్ పల్లి, రత్నపూర్ కాండ్లీ, చర్లపల్లి…








