Category ముఖ్యాంశాలు

నా ప్రతీ కష్టంలో అండగా కొడంగల్‌ ప్రజలు

నేను ఎక్కడున్నా ఓ కన్ను ఈ ప్రాంతంపైనే ఉంటుంది.. తుక్కుగూడ బహిరంగ సభకు భారీగా తరలిరావాలి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొడంగల్‌, ప్రజాతంత్ర, మార్చి 28: తన ప్రతీ కష్టంలో కొడంగల్‌ ప్రజలు అండగా నిలిచారని,  ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడ మే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  అన్నారు. గురువారం ఆయన మీడియాతో…

సిజెఐతో సిఎం రేవంత్‌ భేటీ

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి 28:భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ని తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి  మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తాజ్ఫలక్నుమాలో సీజేఐతో భేటీ అయ్యారు. రాజేంద్రనగర్లో బుధవారం జరిగిన నూతన హైకోర్టు నిర్మాణానికి సీజేఐ డీవై చంద్రచూడ్‌ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీజేఐని సీఎం రేవంత్‌ మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిసింది.…

వేములవాడలో వైభవంగా శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కల్యాణం

సిరిసిల్ల,ప్రజాతంత్ర,మార్చి28 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామిల కల్యాణం (శివ కల్యాణం) గురువారం ఉదయం  అత్యంత వైభవంగా నిర్వహించారు. అన్ని శ్కెవాలయాల్లో శ్రీ శివకళ్యాణాన్ని మహాశివరాత్రి నాడు నిర్వహిస్తుం డగా శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మాత్రం కామ దహనానంతరం (హోలీ  పండుగ) అనంతరం నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో రాజన్న గుడిలో…

కేజ్రీవాల్‌కు మరో నాలుగు రోజుల కస్టడీ

ఏప్రిల్‌ 1న కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఆదేశం దేశం ముందు ఆప్‌ను  దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఇదంతా రాజకీయ కుట్ర అన్న కేజ్రీవాల్‌ న్యూదిల్లీ,మార్చి 28: దిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ఈడీ కస్టడీని దిల్లీ న్యాయస్థానం మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్‌ 1వరకు ఆయన్ను ఈడీ…

ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు

రైతులు ఆగమైపోతున్నా పట్టింపులేదు బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌   ప్రెసిడెంట్‌  కెటిఆర్‌ సిరిసిల్ల,ప్రజాతంత్ర,మార్చి 28:  కాంగ్రెస్‌ పార్టీ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్‌ తెచ్చిన కరువన్నారు. రాజన్న…

బండి సంజయ్‌ సహా పలువురిపై మేడిపల్లి ఠాణాలో కేసులు నమోదు

మేడిపల్లి, ప్రజాతంత్ర, మార్చి 28 : పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ సహా పలువురిపై మేడిపల్లి ఠాణాలో కేసులు నమోదయ్యాయి. చెంగిచర్లలో గత ఆదివారం జరిగిన దాడుల నేపథ్యంలో పలువురు మహిళలు గాయాలపాలవడంతో వారిని బుధవారం బండి సంజయ్‌ పలువురు నాయకులు, కార్యకర్తలతో కలిసి పరామర్శించారు. అయితే…

ఫోన్‌ ట్యాపింగ్‌లో మరో ఇద్దరు అరెస్ట్‌

రాధాకిషన్‌, గట్టు మల్లులను విచారిస్తున్న పోలీసులు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి 28: తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టిన ఉన్నతాధికారులు మరింత వేగం పెంచారు. ఈ కేసులో మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. బంజారాహిల్స్‌ పోలిస్‌ స్టేషన్లో ఆ ఇద్దర్నీ…

అవినీతిపరులపై సీఎం చర్యలేవి?

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సీబీఐ విచారణ జరపాలి రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 28 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అవినీతిపరులను జైలులో వేస్తామని మాటలకే పరిమితమ య్యాడు తప్ప చర్యలు లేవని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ అన్నారు.…

న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు

న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే కుట్రలు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి 500 మంది న్యాయవాదుల లేఖ న్యూదిల్లీ,మార్చి28:  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి సుమారు 500 మందికిపైగా న్యాయవాదులు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో పేర్కొన్నారు. లేఖ…