Category ముఖ్యాంశాలు

నేడు మేడారం సందర్శనకు సిఎం రాక

– ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క ములుగు,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 22: ‌తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి మంగళవారం మేడారం సందర్శించనున్నారు. సిఎం పర్యటన నేపథ్యంలో పంచాయితి రాజ్‌, ‌గ్రాణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ, గ్రాణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ…

సింగరేణి కార్మికులకు ద‌స‌రా బొనాంజా

– పర్మినెంట్‌ ఉద్యోగులకు రూ.1,95,610లు – కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 – కోల్పోయిన రెండు బ్లాకులు సింగరేణిలోకి తెచ్చేందుకు యత్నం – క్రిటికల్‌ మినరల్స్‌ మైనింగ్‌లోకి సింగరేణి ప్రవేశం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : సింగరేణిలో పనిచేస్తున్న 71 వేల మంది కార్మికులకు రూ.819 కోట్లు దసరా…

రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర ఘనం

కాంగ్రెస ప్రభుత్వం, ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం కార్పొరేటన కంపెనీలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతాం సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ప్రకటనలో సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22: రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మరువదు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర సాధన ప్రక్రియలో ప్రత్యేక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను…

కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు నిర్మించాలి

– ముఖ్యమంత్రికి హైకోర్టు సీజే సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: ఎంసీహెచ్‌ఆర్‌డీలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్‌ కుమార్‌ సింగ్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం అంశాలపై చర్చ జరిగింది. కొత్త జిల్లాల్లో అవసరమైనచోట కోర్టు భవనాలు, మౌలిక…

మ‌హిళ‌ల‌ ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగ

– శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతీసాంప్రదాయలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని…

జీవో 68 రద్దు చేయాల్సిందే

– అవుట్‌డోర్‌ మీడియా ఓనర్స్‌ అసోసియేషన్‌కు మద్దతు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2020 తెచ్చిన జీవో 68 ఫలితంగా చిన్న ఏజెన్సీల కార్యకలాపాలు రద్దు కావడంతోపాటు జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో సేవలను బహిష్కరించారని, ఈ జీవో మూడు పెద్ద ఏజెన్సీలకు ప్రయోజనం చేకూర్చడానికే రూపొందించారని బీజేపీ…

హెచ్‌-1బి వీసాల రుసుము భారీగా పెంపు

– భారతీయుల నెత్తిన ట్రంప్‌ మరో పిడుగు – ఏటా లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు – వీసా కావాలన్నా, రెన్యువల్‌ చేసుకోవాలన్నా చెల్లించాల్సిందే – నేటినుంచే అమల్లోకి కొత్త నిబంధనలు వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 20: ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి భారత్‌కు షాక్‌ల విూద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే…

అస్తవ్యస్తమైన జనజీవనం

– హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వాన – వరదల బారిన అనేక ప్రాంతాలు – మరో మూడు రోజులు ఇదే పరిస్థితి – పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం – నాలుగు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, సెప్టెంబరు19: హైదరాబాద్‌లో కుండపోత వాన పడుతోంది. హయత్‌ ‌నగర్‌ ఎల్బీ నగర్‌ ‌ప్రాంతాల్లో పడుతున్న…