స్వామివారి కల్యాణానికి అమిత్షా రాక
భద్రాచలం, మార్చి 27(ప్రజాతంత్ర ప్రతినిధి) : ఏప్రిల్ 10వ తేదీన జరుగనున్న భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవానికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్షా రానున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం కేంద్రం నుండి త్వరలో సంబంధిత అధికారులకు ఆదేశాలు రానున్నట్లు తెలుస్తుంది. భద్రాచలంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించ తలపెట్టిన కాటేజ్లకు శంఖుస్థాపన…
