సామాజిక జీవన సంఘర్షణ

సాహిత్యం వేలు పట్టుకొని నడిచి సమాజాన్ని స్పర్శించి ఆలోచనను రేకెత్తించే కవిత్వం రాస్తున్న ఈ తరం కవులలో అన్నవరం దేవేందర్ ముఖ్యులు. సాహిత్య విలువలతో మానవీయ దృక్పథాన్ని నిర్మాణాత్మకంగా చూపుతూ ముందుకు సాగుతున్న కవిగా ఆయన స్పష్టమైన గుర్తింపును పొందారు. కష్టజీవికి ఇరువైపులా ఉన్నవాడే కవి అన్న శ్రీశ్రీ మాటల్ని తన కవిత్వంలో ప్రతిఫలింపజేసిన కవిగా…








