పసగాడ సన్యాసి

సాహిత్యాన్ని జానపదుల దరి చేర్చిన ఆధునిక కాలంలో తెలుగు సాహిత్యాన్ని భూమార్గం పట్టించిన తొలి సాహిత్యకారుడు పసగాడ సన్యాసి. పండితులకు మాత్రమే పరిమితమైన సంస్కృతభూయిష్ట తెలుగును కాదని జానపదులు హాయిగా పాడుకునే విధంగా ‘పదములు’ రాసిన సాహితీ సంపన్నుడు. విషయం పౌరాణికమే అయినా అది పామరులకు హృదయంలో నాటుకునే విధంగా చెప్పిండు. విజయనగరం జిల్లా దేవునూరు తాలూకా…








