‌బిఆర్‌ఎస్‌వి దిగజారుగు రాజకీయాలు

ఆశా వర్కర్లు సంయమనం పాటించాలి
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ప్రతిపక్ష పార్టీ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.  తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని చాటేలా విజయోత్సవాలు జరుగుతుంటే తట్టుకోలేని ప్రతిపక్ష నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆశా వర్కర్లను రెచ్చగొట్టారని విమర్శించారు. గత పదేళ్ళు పాలనలో ఆశా వర్కర్ల వేతనాల పెంపుపై ఎన్నిసార్లు నిరసనలు, ధర్నాలు చేసినా పట్టించుకోనివాళ్లు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇది వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. 2015లో 106 రోజులు వేతనాలు పెంచాలని ధర్నా చేసిన ఆశా వర్కర్‌ ‌లను గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.

2018, 2020, 2021, 2023 సంవత్సరాల్లో ఆశా వర్కర్లు సమ్మెలు, ధర్నాలు చేశారని మంత్రి దామోదర రాజనర్సింహ గుర్తు చేశారు. అప్పుడు ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించలేని వాళ్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.  ఆశా వర్కర్లు సంయమనంతో వ్యవహరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాజకీయ ప్రేరేపిత ధర్నా, నిరసనలు తెలిపే వారి ఉచ్చులో పడొద్దన్నారు. ప్రజా ప్రభుత్వం ఆశా వర్కర్ల స్వేచ్ఛను గౌరవిస్తుందన్నారు శాంతి భద్రతలకు భంగం కలిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. ఆశా వర్కర్ల నిరసనలో సొమ్ముసిల్లి పడిపోయిన రహీంబీకి ఉస్మానియాలో మెరుగైన చికిత్స ను అందించాల్సిందిగా హాస్పిటల్‌ ‌సూపరింటెండెంట్‌ ‌ను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page