– నిబంధనల ఉల్లఘంనలతో మోసం
– ఆధారలతో ఈసీకి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్2 7: బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఎన్నికల ఆర్వోకు సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శ్రీగణెళిష్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, మీడియా సెల్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేశారు. కోడ్ ఉల్లంఘనలో భాగంగా చర్చిలకు వెళ్లి ప్రచారం చేస్తున్నట్లు ఆధారాలను ఆర్వోకి అందజేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభ్యర్థి పేరు, ఫోటోతో కూడిన వోటర్ స్లిప్స్ పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీపై రిటర్నింగ్ ఆఫీసర్కి ఫిర్యాదు చేశామని రామ్మోహన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ నేతలు వోటరు పోల్ చిట్టిలను పంచుతూ అడ్డంగా దొరికారని మండిపడ్డారు. కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్న బీఆర్ఎస్ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసినట్టే ఇప్పుడు కూడా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు బరితెగిస్తున్నారని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ పొంగనాలు కొడుతున్నారాని ఫైర్ అయ్యారు. కేటీఆర్, హరీష్ దొంగతనం చేసి మాగంటి సునీతకు అంటగడుతున్నారని విమర్శించారు. సునీత గెలవడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేనట్టుందని.. ఓడిపోతారని తెలిసే పిచ్చి నాటకాలు వేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజాయతీగా ఎన్నికల్లో గెలిస్తే హర్షిస్తామని, బీఆర్ఎస్ నేతలు సునీత మంచి కోసం పని చేయాలన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడితే దుబాయ్ శేఖర్ అనే పిలవాలని బల్మూరి వెంకట్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము ఏం చేసినా చెల్లుతుందని వారు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తన సొంత మీడియాలో ప్రకటనలు ఇస్తోందని, వాటిని అభ్యర్థి లెక్కలో జమకట్టాలన్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల రూల్స్ ఉల్లంఘిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణెష్ మాట్లాడుతూ.. ‘ఎన్నికలను ఆదర్శంగా నిర్వహించాలని మేం ప్రయత్నిస్తున్నాం. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం సరికాదు. చర్చిలలో ప్రచారం చేయడం తప్పు. పోల్ స్లిప్స్ పంచితే చర్యలు తీసుకోవాల్సిందే. జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ను గెలిపించాలని నిర్ణయించుకున్నారు. దొంగ దారిలో గెలిస్తే చర్యలు తప్పకుండా ఉంటాయని హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





