టెలిగ్రామ్‌ ‌యాప్‌ ‌నిషేధం తెలివితక్కువ పని

-కేంద్రం తీరుపై మండిపడ్డ రాహుల్‌, ‌కేజ్రీవాల్‌

‌న్యూదిల్లీ, జూన్‌ 17:‌ నీట్‌-‌యూజీ రీ-ఎగ్జామ్‌ ‌నేపథ్యంలో టెలిగ్రామ్‌ ‌యాప్‌ను తాత్కాలికంగా నిషేధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వివాదాన్ని రేకెత్తించింది. కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌సహా ప్రతిపక్ష నాయకులు ఈ చర్యను తీవ్రంగా విమర్శించారు. ’ఈ చర్య నిజంగా పేపర్‌ ‌లీక్‌లను నిరోధిస్తుందా’ అని వారు సందేహాలు వ్యక్తం చేశారు. పరీక్షా పేపర్‌ ‌లీక్‌లను అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వం విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు ’పేపర్‌ ‌లీక్‌ ‌మాఫియాపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, టెలిగ్రామ్‌ను నిషేధించారు. ఇది సమస్యకు పరిష్కారం కాదు. దొంగలను పట్టుకోలేక, బాధితుల తలుపులకు తాళం వేస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఏళ్లుగా టెలిగ్రామ్‌ను ఉపయోగించుకుని నోట్స్, ‌టెస్ట్ ‌సిరీస్‌లు, డిస్కషన్‌లతో చదువుకుంటున్నారు. ఆ సౌకర్యాన్ని లాక్కోవడం పేపర్‌ ‌లీక్‌లకు పరిష్కారం ఎలా అవుతుంది’ అని సోషల్‌ ‌డియా ద్వారా రాహుల్‌ ‌విమర్శించారు. అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌కూడా ఈ అంశంపై స్పందించారు. ’ఈ రోజు టెలిగ్రామ్‌ను నిషేధించారు. రేపు వాట్సాప్‌ను కూడా నిషేధిస్తారా?’ అంటూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించారు. మరోవైపు ఈ నిషేధాన్ని సవాలు చేస్తూ టెలిగ్రామ్‌, ‌దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. టెలిగ్రామ్‌ ‌వ్యవస్థాపకుడు పావెల్‌ ‌దురోవ్‌ ‌కూడా ఈ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ’ఇది 15 కోట్లకు పైగా భారతీయ వినియోగదారులను శిక్షించడమే. ఈ చర్య అసలు లీక్‌లను ఆపదు’ అని వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *