prajatantra_news

prajatantra_news

పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌

– బీఆర్‌ఎస్‌ పార్టీ సంచలన నిర్ణయం – హరీష్‌, సంతోష్‌లపై విమర్శలతో పార్టీ సీరియస్‌ – అధ్యక్షుడి ఆదేశాలతో సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: బీఆర్‌ఎస్‌ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ…

వామన్‌రావు దంపతుల హత్యపై సీబీఐ ద‌ర్యాప్తు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 2: ‌పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో  సీబీఐ ద‌ర్యాప్తు ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 120బీ, 341, 302, 34 సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదుచేసింది. నిందితులుగా వసంతరావు, కుంట శ్రీనివాస్‌, అక్కపాక కుమార్‌ ‌పేర్లను చేర్చింది. 2021, ఫిబ్రవరి 17న పెద్దపల్లి…

సీఎం రేవంత్‌ ‌రెడ్డికి హైకోర్టులో ఊరట

 – కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌2(ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో నమోదైన కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తెలంగాణ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్‌ ‌దాఖలు చేయాలని పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ ‌పల్లె నాగేశ్వర్‌ ‌రావును కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్‌ 7‌వ…

4న నూతన వీఆర్వోలకు నియామక పత్రాలు

– సీఎస్‌ రామకృష్ణారావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: నూతనంగా నియమితులైన ఐదు వేలమంది విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్లకు ఈనెల 5న ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఆరోజు సాయంత్రం 4 గంటలకు జ‌రిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌…

నాటి గుండ్రాంపల్లి ఘటన మరువలేం

– ఆ అమరుల కుటుంబాలకు పాదాభివందనం – నివాళులర్పించిన బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: నిజాం నిరంకుశత్వ పాలనలో గుండ్రాంపల్లిలో 26మందిని రజాకార్లు దారుణంగా చంపి బావిలో పడేసిన ఘటన మరిచిపోలేనేది.. ఆ అమరవీరుల, త్యాగధనుల కుటుంబాలకు పాదాభివందనం చేస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. ఈ గ్రామం సాహస…

మహోన్నత ఆశయంతో ఇళ్ల నిర్మాణం

– మానవీయ కోణంతో చేపట్టిన భారీ సంక్షేమ పథకం – సిమెంటు, స్టీలు పరిశ్రమలు భాగస్వాములు కావాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: ప్రజా ప్రభుత్వం మహోన్నత ఆశయంతో మానవీయ కోణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల భారీ సంక్షేమ పథకాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని సిమెంటు,…

మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిరదని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి 24 గంటలలో ఒరిస్సా తీరాన్ని దాటే అవకాశం ఉంది. రుతుపవన ద్రోణి బికనీర్‌,…

యూరియాపై కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు

– నిన్న 9 వేలు, నేడు 5 వేల మెట్రిక్‌ టన్నులు రాక – మరో వారంలో రానున్న 27,470 మెట్రిక్‌ టన్నులు – ఐదు రోజుల్లో పంట నష్టం సర్వే పూర్తి చేయాలి ` మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యూరియా సరఫరా విషయంలో…

ఏఐపై జ‌ర్న‌లిస్టుల‌కు నేడు వ‌ర్క్‌షాప్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2: తెలంగాణ‌ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (A.I.) వర్క్‌షాప్‌ – టూల్స్ & టెక్నిక్స్ శిక్షణ కార్యక్రమం ఈనెల‌ 3వ తేదీ ఉదయం 10 గంటలకు నాంపల్లి మీడియా అకాడమీ ఆడిటోరియం 5వ అంత‌స్తులో నిర్వహించనున్న‌ట్లు మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి…

వైఎస్‌కు సీతక్క నివాళి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రజా భవన్‌లో ఆయనకు మంగళవారం ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ చైర్మన్లు పటేల్‌ రమేష్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి, బండ్రు శోభారాణి, కాంగ్రెస్‌ నాయకుడు బాస…