prajatantra_news

prajatantra_news

సూర్యాపేట ఓటర్ల జాబితాపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు

సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 24: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో లోపాలున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో కుల రిజర్వేషన్, వార్డు వారీ కేటాయింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, డూప్లికేట్ ఓట్లు, మరణించిన వ్యక్తుల పేర్లు తొలగించలేదని ఆరోపిస్తూ సూర్యాపేటకు చెందిన డి.శివప్రసాద్…

మేడారంలో పిల్లలు తప్పిపోతే టెన్షన్ వద్దు

– పోలీసుల ‘క్యూఆర్ కోడ్’ బ్యాండ్లు రెడీ – చిన్నారులు, దివ్యాంగుల కోసం ‘సీటీ ఎంఎస్’ రిస్ట్ బ్యాండ్లు – ఆవిష్కరించిన డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతరలో భక్తుల వెంట వచ్చే చిన్న పిల్లలు,…

బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు

– ఐదు రోజుల్లో స్పందించని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 24ః తనపై, తన కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్‌లకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విడివిడిగా లీగల్ నోటీసులు జారీ చేశారు. తన రాజకీయ ప్రతిష్టను…

అధికారుల ఆదర్శ వివాహం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 24: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇద్ద‌రు ఉన్నతాధికారుల వివాహం ఆదర్శప్రాయంగా నిలిచింది. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకు చెందిన యువ ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డిని కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి శనివారం ఆదర్శ వివాహం చేసుకున్నారు. శేషాద్రిని రెడ్డి ప్రస్తుతం కుత్బుల్లాపూర్ డీసీపీగా పనిచేస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి…

ట్యాపింగ్‌ ‌విషయాన్ని కేటీఆర్‌ అం‌గీకరించారు

– మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 24:ఫోన్‌ ‌ట్యాపింగ్‌ అనేది ఎన్నో ఏళ్లుగా ఉందని.. కానీ, కేసీఆర్‌ ‌హయాంలో మాత్రమే ఇది వివాదాస్పదమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. దేశ భద్రత కోసం చేయాల్సిన ట్యాపింగ్‌ ‌రాజకీయ స్వలాభం కోసం చేసిన ఘనులు కెసిఆర్‌ అన్నారు. అందుకే దీనిపై విచారణ జరపాల్సి వొచ్చిందన్నారు.…

ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేయాలి

– మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క – మేడారంలో ‘ప్రజాతంత్ర’ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ ములుగు, ప్రజాతంత్ర, జనవరి 24 : పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు మ‌ధ్య‌ వారధిలా పనిచేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారం మహా జాతరలో ప్రజాతంత్ర…

నాంపల్లి ఫర్నీచర్‌ ‌షాపులో అగ్నిప్రమాదం

– తక్షణమే మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది – భారీగా పొగ, మంటలు చెలరేగడంతో ట్రాఫిక్‌ ‌జామ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 24:నగరంలోని రద్దీ ప్రాంతమైన నాంపల్లిలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఫర్నిచర్‌ ‌షోరూమ్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తానికి వ్యాపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.…

సర్వమత సమ్మేళనానికి ప్రతీక జాన్ పహాడ్ దర్గా

– మైనారిటీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల మంత్రి అజారుద్దీన్ సూర్యాపేట, ప్రజాతంత్ర, 24: జాన్ పహాడ్ దర్గా సర్వమత సమ్మేళనానికి ప్రతీక అని మైనారిటీ సంక్షేమ శాఖ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. పాలకవీడు మండలం జాన్‌పహాడ్ దర్గాను మంత్రి శనివారం దర్శించుకున్నారు. ఆనంతరం అయన మాట్లాడుతూ శుక్రవారం ఉర్సు…

శాశ్వత రవాణా సౌకర్యాలే లక్ష్యం

– రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ – మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం ములుగు, ప్రజాతంత్ర, జనవరి 24: మేడారం జాతరకు భక్తుల సౌలభ్యం కోసం నాలుగు వేల ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని, అవసరాన్నిబట్టి మరిన్ని బస్సులు పెంచేందుకు తమ శాఖ సిద్ధంగా ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ…

నిరుద్యోగులారా.. నిరాశ వద్దు

– రాష్ట్రం ఇవ్వకపోయినా మోదీ ప్రభుత్వం ఉద్యోగాలిస్తోంది – యువతను సొంత కాళ్లపై నిలబడేలా చేస్తోంది – కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడుతున్నారని, ప్రజలు అనేక సమస్యలతో అల్లాడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్…