NEWS

NEWS

మానవ జీవన సారాంశ దశ…

మానవ జీవితంలో విలువైనది, కీలకమైనది వృద్ధాప్యం. పరిణతతొ సాగే జీవన సారాంశదశ అని కూడా చెప్ప్చ్చ్నొ. జీవితంలోని అనేకానేక అనుభవాలను సమీక్షించుకంటూనే ఎదురయ్యే సమస్యలను మరింత పటుత్వంతో పరిష్కరించే శక్తిని పెంపొందించుకోవాలంటూ వృద్ధోపనిషత్ను కవితాత్మకంగా ఆవిష్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, విఖ్యాత కవి ఆచార్య ఎన్‌ ‌గోపి. వృద్ధుడంటే ఆయన దృష్టిలో జ్ఞానవృద్ధికి…

యుద్ధానికి ముందే ఓటమి దిశగా కాంగ్రెస్‌

 ( ‌మండువ రవీందర్‌రావు ) ఎన్నికల యుద్ధానికి ముందే తెలంగాణ కాంగ్రెస్‌ ‌తన ఓటమిని అంగీకరిస్తోందా అంటే,  ఆ పార్టీ సీనియర్‌ ‌నేత, ఎంపీ కూడా అయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాటలు అదే సంకేతాన్నిచ్చేవిగా ఉన్నాయి. మరో ఏడాదిలోపు జరుగనున్న ఎన్నికలపై ఆయన వెల్లడించిన అభిప్రాయాన్ని అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఇది కాంగ్రెస్‌ ‌పార్టీని…

అధికారం కోల్పోతామని తెలిసినా… తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాది

రాష్ట్ర ప్రజలు సోనియా రుణం తీర్చుకోవాలి దొరల దోపిడీ నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఓనమాలు రానివారు రాజకీయాల్లో ఉన్నారు పాలకుర్తికి గొప్ప చరిత్ర ఉన్నది:టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి జనగామ పాలకుర్తి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : కుటుంబంలో మరణాలు జరిగితే బాధ ఎలా ఉంటుందో తెలిసిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కేంద్రంలో, రాష్ట్రంలో…

వ్యవసాయం, అనుబంధ రంగాలలో సహకారం కోసం…

భారత్‌, ‌చిలీకి మధ్య ఎమ్‌ఒయుపై సంతకాలకు మంత్రిమండలి ఆమోదం   హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 15 : వ్యవసాయ రంగంలో, దానితో సంబంధం గల రంగాలలో సహకారానికి గాను భారత్‌, ‌చిలీ ప్రభుత్వాల మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం(ఎమ్‌ఒయు)పై సంతకాలు చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం…

ఎపిలో జగన్‌ ‌ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ

అమరావతి, ఫిబ్రవరి 15 : జగన్‌ ‌ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దుపై హైకోర్టు స్టే ఇచ్చింది. చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇటీవల ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్‌ ‌వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. తమకు 1వ…

ఎపిలో రూ.8,800 కోట్లతో కడప స్టీల్‌ ‌ప్లాంట్‌కు సిఎం శంకుస్థాపన

24 నుంచి 30 నెలల్లో తొలిదశ పనులు పూర్తి స్థానికులకే పూర్తి అవకాశాలు ఉంటాయన్న సిఎం జగన్‌ కడప, ఫిబ్రవరి 15 : ఆంధ్రుల కల కడప స్టీల్‌ ‌ప్లాంట్‌కు ముందడుగు పడింది. వైఎస్‌ఆర్‌ ‌జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళప్లలెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్ ‌లిమిటెడ్‌ ‌సంస్థ నిర్మిస్తున్న స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌నిర్మాణ పనులకు సీఎం జగన్‌…

దివ్యాంగుల సహకారానికి భారత్‌, ‌దక్షిణ ఆఫ్రికా మధ్య ఎమ్‌ఒయు

సంతకాలకు మంత్రి మండలి ఆమోదం   హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 15 : దివ్యాంగ జనులకు సంబంధించిన రంగంలో సహకారానికి గాను భారతదేశ ప్రభుత్వానికి, దక్షిణ ఆఫ్రికా గణతంత్ర ప్రభుత్వానికి మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం(ఎమ్‌ఒయు) పై సంతకాలు చేయడానికి  ప్రధాన  మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని…

మేఘాలయ మేనిఫెస్టో విడుదల చేసిన బిజెపి జాతీయ చీఫ్‌ ‌నడ్డా

షిల్లాంగ్‌, ‌ఫిబ్రవరి 15 : మేఘాలయ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేఘాలయలో 7వ పే కమిషన్‌ను అమలు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందేలా చూస్తామని హా ఇచ్చారు. పీఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి కింద రైతులకు చెల్లించే మొత్తాన్ని ఏటా…

నేడు త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు

60 స్థానాలకు పోలింగ్‌కు భారీగా ఏర్పాట్లు చేసిన ఇసి అధికారం నిలబెట్టుకోవడానికి బిజెపి యత్నం కాంగ్రెస్‌తో కలసి పోటీలో కమ్యూనిస్టులు అగర్తల, ఫిబ్రవరి 15 : మూడు ఈశాన్య రాష్టాల్ల్రో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. 16న జరుగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ‌జరుగనుంది. మేఘాలయ, నాగాలాండ్‌లలో 27న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ…

శివరాత్రికి తిరువణ్ణామలైకి ప్రత్యేక బస్సులు

చెన్నై, ఫిబ్రవరి 15 : మహాశివరాత్రి సందర్భంగా తిరువణ్ణామలై, కాళహస్తి క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తమిళనాడు ప్రభుత్వ రవాణా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 18వ తేది మహాశివరాత్రి సందర్భంగా తిరువణ్ణామలై, శ్రీకాళహస్తి ఆలయాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు వెళుతుంటారు. భక్తుల సౌకర్యార్ధం మాధవరం బస్‌ ‌టెర్మినల్‌ ‌నుంచి…