NEWS

NEWS

మృతుల కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 :  కడ్తాల మండలంలోని చరికొండ గ్రామపంచాయతీ పరిధిలో వారం రోజుల క్రితం వసంత, బాదం జయమ్మలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ గురువారం చరికొండ గ్రామానికి చేరుకొని వసంత కుటుంబాన్ని అలాగే జయమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.…

గడపగడపకు సంక్షేమ పథకాలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 26:  గడప గడపకు సంక్షేమ పథకాలు.. గ్రామ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రతి పల్లెను ప్రగతికి ప్రతిరూపంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ 100 సీట్లు కైవసం చేసుకుంటుందని  పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.పటాన్ చెరు…

 పోలీసులు తనిఖీలలో రూ. 2.48 లక్షలు నగదు సీజ్

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 26: ఎన్నికల కోడ్లో భాగంగా పోలీసుల చేపట్టిన తనిఖీలలో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ. 2లక్షల 48 వేల నగదు ను పోలీసులు సీజ్ చేశారు. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా పోలీసులు  తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఇందిరా…

దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ కు ముందు ప్రకటించిన దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి, రైతుబంధు లాంటి పథకాలను నిలుపుదల చేయాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేయడంపై దీనికి నిరసనగా గురువారం  ఆమనగల్లు…

29న బిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం సమావేశం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ విజయం కోసం ప్రతి కార్మికుడు భాగస్వామి అయ్యేలా ఈనెల 29 న పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గస్థాయి కార్మికుల సమావేశం నిర్వహిస్తున్నట్లు బిఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి నాలకంటి యాదగిరి యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.మినీ ఇండియా…

కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం కసిరెడ్డిని గెలిపించుకుందాం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : కల్వకుర్తి నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకు కొత్త మలుపు తిరుగుతున్నాయి. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రాజకీయం రసవత్తరంగా మారుతున్నాయి. కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలను సమసి పోయే విధంగా కృషి చేస్తూ.. అలక వహించిన వారిని ఏదో…

బిజెపిలో చేరిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 :  కడ్తాల్ మండలం గోవిందాయపల్లి, అన్మాస్ పల్లి, గానుగుమర్ల తండా కు చెందిన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు సుమారు 100 మంది బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా వారిని కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారి బిజెపి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు…

పటాన్ చెరులో కమలానికి జలక్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: పటాన్ చెరు నియోజకవర్గం బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్, మాజీ సర్పంచ్ శంకర్ యాదవ్ గురువారం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో  రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్…

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి   టిఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే  సాధ్యం

 షాద్ నగర్ ప్రజాతంత్ర అక్టోబర్ 26 :గంట్లవెళ్లి, శేరిగూడ గ్రామాల్లో భారీగా ఎన్నికల ప్రచారం షాద్ నగర్ నియోజక వర్గ  ప్రజలు అభివృద్ధికి ఓటు వేయాలని స్థానిక ఎమ్మెల్యే టిఆర్ఎస్ అభ్యర్థి వై అంజయ్య యాదవ్ ప్రజలను ఎన్నికల ప్రచారంలో కోరారు. ఫరూక్ నగర్ మండలం గంట్లవెళ్లి, శేరిగూడ గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం పెద్ద…

త్రిపుర సిఎం మాణిక్ సాహను కలసిన కలహర్ రెడ్డి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : త్రిపుర సిఎం మాణిక్ సాహను అఖిల భారత అయ్యప్ప సేవ ట్రస్ట్(సబస్) సభ్యులు, శబరిమల దేవస్థానం ట్రావెన్కోర్ బోర్డు సభ్యులు కలహర్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం పలు రాజకీయ విషయాలపై చర్చించినట్లు కలహర్ రెడ్డి పేర్కొన్నారు.హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్…