NEWS

NEWS

డిసెంబర్ లో గీతం పూర్వ విద్యార్థుల సమ్మేళనం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 9: హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 2011 నుంచి 2020 మధ్య విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని డిసెంబర్ 22-23 తేదీలలో నిర్వహించనున్నట్టు అలుమినీ సమన్వయకర్త ప్రొఫెసర్ పి.త్రినాథరావు గురువారం వెల్లడించారు. డిసెంబర్ 22న (శుక్రవారం) నెట్ వర్కింగ్ డిన్నర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆరంభమవుతుందని, తమతో పాటు విద్యనభ్యసించిన…

కేఎల్ఆర్ విజయం కోసం పరితపిస్తూ ప్రచారం

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 9: మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచెన్నగారి లక్ష్మారెడ్డి విజయం కోసం పరితపిస్తూ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలను వెంటబెట్టుకొని ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్కు ఓటు వేయాలని పూర్తిస్థాయిలో కందుకూరు మండల యువజన అధ్యక్షులు దంతోజి నరసింహా చారి పలువురు నాయకులతో కలసి అభ్యర్థిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే…

ఆకట్టుకున్న కళా విశారద డాక్టర్ సురభి లక్ష్మి శారద ప్రదర్శన

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 09 :  ఒయాసిస్ ఫౌండేషన్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ భారత ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఏకతాన్ భారతీయ కళల సమాహారాన్ని ఈజిప్ట్ కైరో భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కళా విశారద డాక్టర్ సురభి లక్ష్మి శారద ప్రదర్శించిన బాల గోపాల తరంగం జావలీల అభినయ ప్రదర్శన…

ఆచారి గెలుపు కోసం 15 వార్డులో ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9 : అమనగల్లు మున్సిపాలిటీ 15వ వార్డులో బీజేపీ కల్వకుర్తి నియోజకవర్గం అభ్యర్థి ఆచారి గెలుపు కోసం ఆమనగల్లు మున్సిపాలిటీ పాలకవర్గం కార్యకర్తలు నాయకులు అభిమానులు గడప గడపకు వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  కాలనీలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాల గురుంచి.. బీజేపీ కల్వకుర్తి అభ్యర్థి తల్లోజు ఆచారి చేసిన…

నామినేషన్ దాఖలు చేసిన బిజెపి అభ్యర్థి ఆచారి సతీమణి గీత 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9 : కల్వకుర్తి నియోజకవర్గ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆచారి తరపున ఆయన సతీమణి గీత గురువారం కల్వకుర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆమనగల్లు మాజీ జెడ్పిటిసి కండే హరిప్రసాద్, బిజెపి సీనియర్…

మీ ఆశీస్సులందించి సహకరించండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 9: పటాన్ చెరు కాంగ్రెస్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ముందుకు వెళ్తానని మీ అందరి ఆశీస్సులు అందించి సహకరించాలని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం పటాన్ చెరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను, ముఖ్య నాయకులను…

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 9 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నామినేషన్ల దాఖలు చేసేందుకు బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు చెందిన మల్ రెడ్డి రంగారెడ్డి,మంచిరెడ్డి కిషన్ రెడ్డిలు తమ తమ అనుచర గణంతో భారీ ర్యాలీలు నిర్వహించి ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇరు పార్టీలు ఎదురెదురుగా తారాసపడి నినాదాలు చేసుకుంటూ ఒకరిపై…

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మధు యాష్కీ గౌడ్ నామినేషన్ దాఖలు

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 09 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారన్నారని, తనను గెలిపిస్తే ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ప్రజా సంక్షేమం కోసం ఎల్లవేళలా తోడుంటానని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మధు యాష్కీ గౌడ్ హామీ ఇచ్చారు. గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గం…

కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఓట్లు వేస్తే.. కరెంట్ కష్టాలు తప్పవు

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 9: కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓట్లు వేస్తే, తెలంగాణ అందకారం కావడం ఖాయమని, 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న బి అర్ ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓట్లు వేయాలని మహేశ్వరం నియోజకవర్గం బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్…

‌ప్రజా‘తంత్రం’

సర్వేలు గిర్వేలు విచిత్రపు తంతు ఏదీ సర్వేజనా సుఖినోభవంతు? సమస్యల నివేదనే మనదైన గొంతు తీర్చగలవారే సమర్ధుల బాపతు! ఐదేళ్ల పిదప వస్తుంది మన వంతు ఎన్నికలపర్వం ఒకానొక గమ్మత్తు ఎంతెంతో కీలకం చదరంగపుటెత్తు స్వార్థరాజకీయాన్ని చేయాలి చిత్తు – వి.రమేష్‌ ‌బాబు   రాష్ట్ర ఎన్నికల అధికారి రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు,ప్రతిపక్ష పార్టీలు…