NEWS

NEWS

రేపు పది ఫలితాలు…

ఫెయిల్‌ ఐనా కూడా అవకాశాలు ఎన్నో… స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కోర్సులలో చేరొచ్చు… జీవితంలో తిరిగి పొందలేనివి రెండే రెండు అవే ఒకటి కాలం, రెండోది ప్రాణం. క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. భారతదేశ విద్యావ్యవస్థలో పదవతరగతి ఒక మైలు రాయి. తన జీవన ప్రయాణంలో మొట్ట మొదటి మెట్టు పదవతరగతి ఫలితాలు.…

కాంగ్రెస్ పాలనలోనే పరిశ్రమలు..

అబద్ధపు హామీలిచ్చిన బిఆర్ఎస్ ను గద్దె దింపారు కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి: డిప్యూటీ సీఎం  బట్టి విక్రమార్క  కొత్తగూడెం, ప్రజాతంత్ర : మన నిధులు, నీళ్లు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడితే రాష్ట్రం  ఏర్పడ్డాక గత ప్రభుత్వం రూ7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిందని డిప్యూటీ…

కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే

రూ 2లక్షల రుణమాఫీ చేస్తాం ఆర్ ఆర్ ఆర్ ను లక్ష మెజారిటీతో గెలిపించాలి: మంత్రి పొంగులేటి  కొత్తగూడెం, ప్రజాతంత్ర : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లులు, రేషన్ కార్డులో సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఆర్ఆర్ గెలుపు కోసం…

రసాయన ఆయుధాల నిషేధాన్ని గౌరవిస్తున్నామా..!

‘అంతర్జాతీయ రసాయన ఆయుధాల సమావేశం’లో తీసుకున్న నిర్ణయాలు 29 ఏప్రిల్‌ 1997 నుంచి అమలులోకి వచ్చాయి. 11 నవంబర్‌ 2005న ఐక్యరాజ్యసమితి నిర్వహించిన 10వ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ప్రతి ఏటా 29 ఏప్రిల్‌ రోజున ‘రసాయన యుద్ధ క్షతగాత్రుల స్మారక దినం’ పాటించుట ఆనవాయితీగా మారింది. ఈ వేదికగా రసాయన యుద్ధ క్షతగాత్రులకు…

సాగునీటి వివక్షతపై ఎలుగెత్తి చాటిన విద్యాసాగర్‌ రావు

 నేడు  ఆర్‌.విద్యా సాగర్‌రావు  వర్థంతి వలస పాలకుల స్వార్థ పాలనలో, సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టు ల్లో మోసంపై గణాంకాలతో తెలంగాణ జాతిని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్‌ రావు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం, ప్రాజెక్టులపై జరిగిన అన్యాయం పై విద్యాసాగర్‌రావు చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యం.…

మా పథకాలు అమలు చేయకుండా చతికిల

ఉద్యమం చేసి సాధించిన తెలంగాణను కాపాడాం అభివృద్ధి పథకాలతో ముందుకు తీసుకుని వెళ్లాం నాగర్‌కర్నూలు ప్రచారంలో బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ నాగర్‌కర్నూల్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌నిలదీశారు. కొత్తగా గడ్డపార పట్టి తవ్వాల్సిన…

ఎన్నికల కోడ్‌ ‌తరవాత నిరుపేదలకు ఇళ్లు

మమ్మల్ని ప్రశ్నించేహక్కు బిఆర్‌ఎస్‌కు లేదు పెద్దపల్లి ప్రచారంలో మంత్రి శ్రీదర్‌ ‌బాబు పెద్దపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ఎన్నికల కోడ్‌ అయిపోగానే అర్హులైన ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి శ్రీధర్‌ ‌బాబు అన్నారు. శనివారం ముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి మంత్రి…

కాళేశ్వరంపై విచారణకు కెసిఆర్‌ను పిలిస్తే తప్పేముంది…

వివరాలు తెలుసుకోవాలనుకోవడంలో తప్పు లేదు కొన్ని విషయాల్లో మోదీని నమ్మి మోసపోయాం అనవసరంగా నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చాం బిఆర్‌ఎస్‌ 8 నుంచి 9 సీట్లు సాధిస్తుంది మీడియాతో చిట్‌చాట్‌లో కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : కాళేశ్వరంపై విచారణకు మాజీ సీఎం కేసీఆర్‌ ను పిలిస్తే తప్పులేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌…

రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత విద్యార్థులదే..

భారత్‌ జోడో అభియాన్‌ జాతీయ కన్వీనర్‌ ప్రొ.యోగేంద్ర యాదవ్‌ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం : దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సుకుమార్‌ నారాయణ విచ్ఛిన్నం చేసే శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపు హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27: భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత విద్యార్థులదే అని భారత్‌ జూడో అభియాన్‌ జాతీయ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ యోగేంద్ర…

ప్రజల కోసం మాట్లాడుతుంటాం..కొట్లాడుతుంటాం

తెలంగాణకు ఒక గొంతుక అవసరం తొమ్మిదిన్నరేండ్లలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపేందుకు అహర్నిశలు కృషి చేశాం తెలంగాణభవన్‌లో బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవంలో కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : విజయాలకు పొంగిపోము, అపజయాలకు కృంగిపోమనేలా తమ ప్రస్థానం సాగుతుం దని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ అన్నారు. భవిష్యత్తులోనూ ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాం.. కొట్లాడుతూనే…