భూభార‌తితో భూ స‌మ‌స్య‌లన్నీ ప‌రిష్కారం

వొచ్చేనెల నుంచి గ్రామ‌ప‌రిపాల‌నా అధికారులు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 :  భూభార‌తి చ‌ట్టం ద్వారా రాష్ట్రంలోని భూ స‌మ‌స్య‌లన్నింటినీ ప‌రిష్క‌రిస్తామ‌ని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్ర‌క‌టించారు.భూభారతి పేదలు, బడుగు, బలహీన వర్గాలు, రైతులకు, భూములున్న ఆసాముల కోసం తీసుకొచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తెలంగాణ భూ భారతి- 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో  భాగంగా సోమవారం నల్గొండ జిల్లా చందంపేట మండలం, రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీం ప‌ట్నం మండ‌ల‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల‌కు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికై రాష్ట్రంలోని 4 మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకున్నామని తెలిపారు. ఈ నెలాఖరునాటికి ఈ పైలెట్ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. వొచ్చే నెల 1 నుంచి గ్రామ‌ప‌రిన‌పాల‌నాధికారుల నియామ‌క చ‌ర్య‌లు ప్రారంభ‌మ‌వుతాయ‌ని మంత్రి తెలిపారు. జూన్ 2 నుంచి ఈ పైలెట్ మండలాలలో వ్యవసాయ భూముల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించనున్నామని తెలిపారు. మే 1 నుంచి అన్ని జిల్లాలలో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకోనున్నామని, అత్యంత వెనుకబడిన చందంపేట మండలాన్ని కూడా పైలెట్ మండలంగా తీసుకునే విషయమై ఆలోచిస్తామని తెలిపారు. జూన్ 2 నుంచి ప్రతి గ్రామానికి తహసీల్దార్ స్థాయి.

అధికారులు గ్రామానికి వొచ్చి భూ సమస్యల పై దరఖాస్తులు తీసుకుంటారని, రైతులు ఒక రూపాయి కూడా చెల్లించకుండా రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రైతుల భూముల సర్వే కోసం 6000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనున్నామని, ప్రతి గ్రామానికి ఒక గ్రామ పరిపాలన అధికారి చొప్పున 10695 మందిని వొచ్చే నెల మొదటివారం నుంచి పంపించనున్నామని ఆయన వెల్లడించారు. ప్రతి మనిషికి ఆధార్ లాగే భూదార్ కార్డు ను ఇచ్చి ఖాతా నెంబర్ ను ఇవ్వనున్నమన్నారు. గతంలో భూములు అమ్మిన, కొన్న మ్యాపింగ్ లేదని, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాప్ ను తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చట్టంలో తీసుకువచ్చామని  వెల్లడించారు. సాదా బైనామాలకు ధరణిలో ఎలాంటి అవకాశం లేదని,భూ భారతిలో దీనిని పరిష్కరించనున్నామని, తొమ్మిది లక్షల 26 వేల సాదా బైనామా దరఖాస్తులున్నాయని ,వాటిలో న్యాయమైన వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.

ప్రతి పేద వాడి కన్నీళ్లు తుడిచేందుకు తీసుకొచ్చిన చట్టం భూ భారతి చట్టం అని, ఈ చట్టాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని, చట్టాన్ని బాగా అమలు చేసి ప్రజలకు ఉపయోగపడే చుట్టంగా చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గతంలో పట్టాలిచ్చిన డి- లిమిటేషన్ ఫారెస్ట్ భూములను పరిశీలించి, ఎవరికి ఎంత భూమి ఉందో నిజంగా సాగులో ఉన్న రైతులకు పట్టాలు ఇస్తామని తెలిపారు. పునరావాసకాలనీల ఏర్పాటు సందర్భంగా, ఒక చోట నుంచి మరోచోటికి రైతులు వెళ్లిన సందర్భంలో రైతులకు ఇచ్చిన భూముల డీ లిమిటేషన్ విషయంలో ఇప్పటివరకు ఇబ్బందులు పడ్డారని, అలాగే డీ నోటిఫికేషన్ భూముల విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ధరణి సమయంలో ప్రభుత్వం వద్దకు ప్రజలు వెళ్లాల్సి వచ్చేదని, వీటన్నిటికీ పూర్తిగా న్యాయం జరిగేలా భూ భారతి లో ప్రణాళికలు రూపొందించామని ఆయన తెలిపారు. తమది సమస్యలను పరిష్కరించే ప్రభుత్వమని చేతల ద్వారా నిరూపిస్తున్నామని మంత్రి వెల్లడించారు. సమాశంలో క శాసనసభ్యులు బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం,  కలెక్టర్ ఇలా త్రిపాఠి త‌దిత‌రులు ప్రసంగించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవర్, దేవరకొండ అదనపు ఎస్ పి మౌనిక, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page