– బైకర్ను ఢీకొట్టిన కారు..బాలుడు మృతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలంలోని పుప్పాలగూడ అల్కాపురి కాలనీలో సోమవారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. టపాసులు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వొస్తున్న తండ్రికొడుకులపై వేగంగా దూసుకొచ్చిన కారు బీభత్సం సృష్టించింది. పుప్పాలగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి తన కుమారుడు కుశల జోయల్తో కలిసి బైక్పై ఇంటికి వొస్తుండగా, ఎదురుగా వచ్చిన కారు బైక్ను ఢీ కొట్టింది. వేగంగా ఢీకొనడంతో బాలుడు రోడ్డుపై పడిపోగా, అదే కారు అతనిపై నుంచి దూసుకెళ్లింది. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. తక్షణమే స్థానికులు స్పందించి, గాయపడిన వారిని సప హాస్పిటల్కి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





