వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు

డా।। బిఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సచివాలయంలో సీఎం కేసీఆర్‌ ‌సమీక్ష

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : రాష్ట్రంలో వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై ఆదివారం డా।। బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్‌ ‌సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటి పారుదల సహా ఇతర శాఖల్లో వీఆర్‌ఏలను సర్దుబాటు చేసే విషయమై చర్చించారు. ఈ సమావేశంలో సిఎస్‌ ‌శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, వీఆర్‌ఏ ‌జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *