Take a fresh look at your lifestyle.

రాష్ట్రానికి మేఘాలయ ముఖ్యమంత్రి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 7 : ‌మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ ‌కె. సంగ్మా, గురువారం  ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్‌ ‌రావు తో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.. ప్రకటనలో  సీఎం సంగ్మాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సాదరంగా ఆహ్వానించారని..అనంతరం తేనీటివిందు ఆతిథ్యం ఇచ్చారు.. కాసేపు ఇరువురు సిఎం లు ఇష్టాగోష్ఠి నిర్వహించారు.

అనంతరం సీఎం సంగ్మాను శాలువాతో సిఎం కేసీఆర్‌  ‌సత్కరించి,  మెమొంటో  బహుకరించారు. అనంతరం తిరుగు ప్రయాణమైన మేఘాలయ సిఎం కు సిఎం కేసీఆర్‌ ‌వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా.. మంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యే రోహిత్‌ ‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌ ‌కుమార్‌, ‌మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, బీఆర్‌ఎస్‌ ‌నేతలు దాసోజు శ్రవణ్‌, ‌కె వంశీధర్‌ ‌రావు తదితరులు పాల్గొన్నారు అని పేర్కొన్నారు.

Leave a Reply