రాష్ట్రానికి నిధులు రాబట్టడమే లక్ష్యం

రహదారుల ప్రాజెక్టులపై గడ్కరీతో చర్చించా..
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వెల్లడి

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 26: కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అందుకోసమే వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని వివిధ రహదారుల ప్రాజెక్టుల విషయమై దిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జాతీయ రహదారులకు సంబంధించి గత అయిదేళ్లలో తెలంగాణకు అతి తక్కువ నిధులు వచ్చాయి. భూసేకరణ, ఇతర అంశాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దాంతో పనులు ఆగిపోయాయి. 2016లో ప్రకటించిన రీజినల్‌ రింగ్‌రోడ్డును మరిచిపోతే మా ప్రభుత్వం వచ్చిన తరువాత కదలిక తీసుకొచ్చాం.

యుటిలిటీ ఛార్జీలను భరిస్తామని చెప్పాం. కేంద్రమంత్రి గడ్కరీ స్పందించి తామే భరిస్తామని భరోసా ఇచ్చారు. 50-50 షేరింగ్‌లో భూసకరణ ప్రారంభించాలని తాజా సమావేశంలో నిర్ణయించామని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగకరమైన 6 లేన్‌ గురించి కూడా చర్చించాం. రెండేళ్లలోపే విజయవాడ-హైదరాబాద్‌ మార్గాన్ని రూ.4వేల కోట్ల బ్జడెట్‌తో పూర్తి చేయనున్నామని, ఏపీ విభజన చట్టం ప్రకారం గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు రూపకల్పన చేస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడిరచారు. అన్ని వినతులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. తెలంగాణకు రావాల్సిన నిధులన్నీ సాధించడమే మా లక్ష్యం. జవాబుదారీతనంగా పని చేయడం మాకు తెలుసు కాబట్టే ఇంత మంది మంత్రులం దిల్లీకి వచ్చి మాట్లాడుతున్నాం. ఉప్పల్‌-ఘట్‌కేసర్‌ రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో వాటిని త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం‘ అని కోమటిరెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *