రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించాలి

ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 08 : నూతన తెలుగు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

నేటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి,  రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి అభిలషించారు. మన సంస్కృతి సంప్రదాయాలు చాటిచెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *