- బావిలో పడ్డ 25 మంది…6 గురు మృతి
- ముమ్మరంగా సహాయక చర్యలు
భోపాల్, మార్చి 30 : శ్రీరామనవమి వేళ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రమాదం చోటుచేసుకుంది. స్నేహ్ నగర్ సపంలోని పటేల్ నగర్లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో మెట్ల బావి పైకప్పు కూలడంతో 25 మందికి పైగా మెట్ల బావిలో పడిపోయారు. అందులో 6 గురు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.
15 మందిని కాపాడారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సమయంలో స్థానికులు సైతం బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. బావిలో పడిన వారిని రెస్క్యూ టీంతో పాటు నిచ్చెన సాయంతో బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు.