Take a fresh look at your lifestyle.

నేటి నుంచి ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు

కట్టుదిట్టమైన భ్రదతా ఏర్పాట్లు చేస్తున్నామన్న పోలీస్‌ కమిషనర్‌

క్రికెట్‌ మ్యాచ్‌ కోసం ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు : ఉపయోగించుకోవాలని ఎండి సజ్జనార్‌ వినతి

 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 24 : గురువారం నుంచి ఉప్పల్‌ వేదికగా భారత్‌`ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ పోరుకు రాజీవ్‌గాంధీ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాకి రెట్టలు, విరిగిపోయిన పాత కుర్చీలను మార్చడంతో పాటు కొత్తగాపై కప్పులను నిర్మించారు. చూడగానే ఇది మన ఉప్పల్‌ స్టేడియమేనా అని ఆశ్చర్యపోయేలా కలర్‌ఫుల్‌గా మార్చేశారు. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ సీపీ సుధీర్‌ బాబు విూడియా సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం 6.30 నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామని తెలిపిన రాచకొండ సీపీ.. స్టేడియం చుట్టూ ఏర్పాటుచేసిన 360 సీసీ కెమెరాలతో భద్రతను పరీక్షిస్తున్నట్లు వెల్లడిరచారు. పోలీస్‌ అధికారులపై కూడా నిఘా ఉంచుతామని తెలిపారు. ప్రేక్షకులు స్టేడియం లోపల బయట మంచిగా నడుచుకోవాలని కోరారు. ‘ఉదయం 6.30 నుండి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తాం. స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. పోలీస్‌ అధికారులపై కూడా నిఘా ఉంచుతాం. పీక్‌ అవర్స్‌లో ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో వొస్తారు కాబట్టి.. స్టేడియం చుట్టూ ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి. 1500 మంది పోలీసులతో మ్యాచ్‌కి బందోబస్తు ఏర్పాటు చేశాం. ఆక్టోపస్‌ బలగాలు, 100 షీ టీమ్స్‌ విధుల్లో ఉంటాయి. ఎట్టి పరిస్థితులలోనూ స్టేడియంలోకి కెమెరాలు, ల్యాప్‌ టాప్స్‌, బ్యాగ్స్‌, సిగరేట్స్‌, హెల్మెట్స్‌, వాటర్‌ బాటిల్స్‌, పెన్స్‌, పవర్‌ బ్యాంక్స్‌, బయటి ఫుడ్‌ అనుమతించమని అన్నారు. స్టేడియానికి వొచ్చే ప్రేక్షకులు మంచిగా నడుచుకోవాలని, క్రమశిక్షణతో మెలగాలని తెలిపారు. ఒకసారి లోపలికి వెళ్లాక బయటకి వెళ్లి తిరిగి స్టేడియం లోపలికి వొస్తామంటే అనుమతించమని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మ్యాచ్‌కి వొచ్చే వారికి సరైన పార్కింగ్‌ సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని, బ్లాక్‌ టికెట్స్‌ అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ సుధీర్‌ బాబు చెప్పారు. 2018 తర్వాత జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ కావడంతో భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరవ్వొచ్చని అంచనా ఉందని, అందునా పాఠశాల విద్యార్థులకు ప్రవేశం ఉచితం కావడంతో ఎటు చూసిన వారే కనిపించొచ్చన్నారు.

క్రికెట్‌ మ్యాచ్‌ కోసం ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు : ఉపయోగించుకోవాలని ఎండి సజ్జనార్‌ వినతి

గురువారం నుంచి జరిగే భారత్‌`ఇంగ్లండ్‌ క్రికెట్‌ టెస్ట్‌ మ్యాచ్‌కు వెళ్లేందుకు టీఎస్‌ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను నడపనుంది. జనవరి 25`29 మధ్య ఐదు రోజుల పాటు ఉప్పల్‌ స్టేడియంకు అరవై ప్రత్యేక బస్సులను నడపనుంది. ఆర్‌జిఐసి స్టేడియం విూదుగా ఉప్పల్‌కు సాధారణ సర్వీసులతో పాటు మ్యాచ్‌ కోసం ఈ ప్రత్యేక బస్సులను నడుపుతామని ప్రజా రవాణా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియంకు 60 బస్సులు నడపనున్నారు. ఈ బస్సులు ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. తిరిగి 7 గంటల వరకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. మ్యాచ్‌ని వీక్షించేందుకు ఈ ప్రత్యేక బస్సులను ఉపయోగించుకోవాల్సిందిగా క్రికెట్‌ అభిమానులను ఆర్టీసీ అభ్యర్థిస్తుందని ఎండి సజ్జనార్‌ ఎక్స్‌లో పోస్ట్‌ ద్వారా ప్రకటించారు.

 

Leave a Reply