జగదేవపూర్, ప్రజాతంత్ర, జనవరి 3: జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో రైతు అయ్యమ్మగారీ సత్యనారాయణ రెడ్డి వెద (డ్రమ్ సీడర్) పద్ధతి ద్వారా సాగు చేసిన 2.20 ఎకరాల వరి పొలం డ్రం సీడర్ వినియోగించినను జిల్లా వ్యవసాయ అధికారి కె.శివ కుమార్ సందర్శించి పలు సూచనలు చేయడం జరిగింది. వెద పద్ధతి ద్వారా పంట కాల పరిమితి తగ్గించుకోవచ్చునని, పంట పెట్టు బడి తగ్గుతుందని మరియు మంచి దిగుబడి పొందవచ్చని తెలిపారు.వీరితో పాటుగా మండల వ్యవసాయ అధికారి వసంత్ రావు, వ్యవసాయ విస్తరణ అధికారి ఖలీల్ ,రైతులు భాగ్య రెడ్డి, వెంకట్ రెడ్డి, సాయి రెడ్డి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
డ్రమ్ సిడర్ ద్వారా వరి సాగు రైతులకు అధిక దిగుబడి





