టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 30 : ఎన్నికలు వొచ్చినప్పుడు తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి చేకూరేలా కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. నాగార్జునసాగర్ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ…ఏం ఆశించి ఇలా చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నదన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం కేసీఆర్కు అలవాటే అని విమర్శించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుందని, నీళ్లు ఎక్కడికీ పోవు. సామరస్యపూర్వకంగా ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.
ఎన్నికలపై ఇలాంటి కుట్రలు పని చేయవు. దేశాలే నీటి సమస్యలను పరిష్కరించుకుంటున్నప్పుడు..రా





