అమేథీ నుంచి లోక్‌సభకు రాహుల్‌ పోటీ

వెల్లడించిన  యూపీ కాంగ్రెస్‌ నేత
అమేథీ, మార్చి 6 : వొచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో అమేథీ నుంచి కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పోటీ చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రదీప్‌ సింగాల్‌ వెల్లడిరచారు. దిల్లీలో అధిష్టానంతో సమావేశం అనంతరం తిరిగి వొచ్చిన అనంతరం రాహుల్‌ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నట్లు, ఆయన పేరు త్వరలో ప్రకటింనున్నట్లు సింగాల్‌ వెల్లడిరచారు. అమేథీ నుంచి రాహుల్‌ 2002 నుంచి 2019 వరకు అనేక సార్లు లోక్‌ సభకు ప్రాతినిధ్యం వహించారు. 2019 సాధారణ ఎన్నికల్లో ఆయన బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో వోడిపోయారు. ప్రస్తుతం రాహుల్‌ కేరళలోని వాయనాడ్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *