హైదరాబాద్‌లో 200 కోట్లతో సీరమ్స్ ‌సంస్థ టీకా తయారీ కేంద్రం

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌హైదరాబాద్‌ ‌జీనోమ్‌ ‌వ్యాలీలో భారత్‌ ‌సీరమ్స్ అం‌డ్‌ ‌వ్యాక్సిన్‌(‌బీవీఎస్‌) ‌సంస్థ రూ. 200 కోట్లతో టీకాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ సంజీవ్‌ ‌నావన్‌ ‌గుల్‌.. ‌రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి ప్రకటించారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినందుకు ఎండీ సంజీవ్‌ ‌నావన్‌ ‌గుల్‌కు ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్యతో ప్రపంచంలోనే టీకా హబ్‌గా హైదరాబాద్‌ ‌నగరం తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page