సముద్ర తీరాన్ని కాపాడే సాహస వీరులు వీరే…

నేడు  ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌డే సందర్భంగా…

ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1 తేదీన దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు మరియు జైసల్మేర్‌ నుండి ఇందిరా పాయింట్‌  వరకు దాదాపు 7516.7 కి.మీ.పొడవు కలిగిన విస్తారమైన తీర ప్రాంతం మన దేశం కలిగి ఉంది. ఈ తీరప్రాంత భద్రతకు ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ (భారతీయ తీర రక్షకదళం) బాధ్యత వహిస్తుంది. భారతదేశ తీర ప్రాంత సరిహద్దులు, ద్వీపాలను రక్షించడంలో మరియు భారతీయ మత్స్యకారులకు రక్షణ కల్పించడంలో భారతీయ తీర రక్షక దళం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద కోస్ట్‌ గార్డ్‌.

ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ డే చరిత్ర
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత నావికాదళం దేశ సముద్ర సరిహద్దుల భద్రతకు బాధ్యత వహించింది. 1960వ దశకంలో, సముద్రం ద్వారా జరిగే వస్తువుల అక్రమ రవాణా భారతదేశ దేశీయ ఆర్థిక వ్యవస్థకు ముప్పు తెచ్చింది. సముద్రాల మీదుగా సాగే స్మగ్లింగ్‌ ప్రబలంగా ఉంది మరియు దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు తెచ్చింది. కస్టమ్స్‌ మరియు ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్‌ వంటి ప్రస్తుత సముద్ర ఏజెన్సీలకు ఈ పెద్ద ఎత్తున స్మగ్లింగ్‌ కార్యకలాపాలను నియంత్రించే సామర్థ్యం లేదు మరియు ప్రాదేశిక జలాల్లో కూడా అక్రమ నాలాలను అడ్డగించే సామర్థ్యం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి, నాగ్‌ చౌదరి కమిటీని 1970లో ఇండియన్‌ నేవీ మరియు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. ఆగస్ట్‌  1971లో, భారతదేశం  విస్తారమైన తీరప్రాంతంలో గస్తీ నిర్వహించాల్సిన అవసరాన్ని కమిటీ గుర్తించింది, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను గుర్తించేందుకు ఆఫ్‌షోర్‌ ఫిషింగ్‌ ఓడల రిజిస్ట్రీని ఏర్పాటు చేసింది మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో నిమగ్నమైన నౌకలను అడ్డుకునేందుకు సమర్థమైన మరియు సుసంపన్నమైన దళాన్ని ఏర్పాటు చేసింది. ఆ సేవలను అందించడానికి అవసరమైన పరికరాలు, మౌలిక సదుపాయాలు మరియు సిబ్బంది సంఖ్య మరియు స్వభావాన్ని కూడా కమిటీ పరిశీలించింది. ముంబయి (అప్పటి బొంబాయి) హైలో చమురును కనుగొనడం మరియు అధిక-విలువైన ఆఫ్‌షోర్‌ ఇన్‌స్టాలేషన్‌ల అభివృద్ధి, భారతదేశ పారిశ్రామిక మరియు ఆర్థిక ప్రయోజనాలలో అత్యంత కీలకమైన ఈ ప్రాంతంలో రక్షణ మరియు విపత్తు ప్రతిస్పందన కోసం చర్యలు కూడా అవసరమైనందువల్ల ప్రభుత్వం స్మగ్లింగ్‌ మరియు ఇతర చట్టవిరుద్ధమైన సముద్ర కార్యకలాపాలను ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఉన్న యంత్రాంగంలోని లోపాలను పరిశీలించడానికి మరియు భారతదేశ సముద్రాన్ని రక్షించడానికి చర్యలను సూచించడానికి  కె యఫ్‌ రుస్తమ్‌జీ అధ్యక్షతన సెప్టెంబర్‌ 1974లో ఒక కమిటీని నియమించింది.

1975లో ఈ కమిటీ తన నివేదికలో మన సముద్ర ప్రాంతాల సాధారణ పర్యవేక్షణ మరియు పోలీసింగ్‌ కోసం కోస్ట్‌ గార్డ్‌ తరహా సంస్థను ఏర్పాటు చేయాలని గట్టిగా సిఫార్సు చేసింది. 1977లో. భారత నావికా దళం నుండి బదిలీ చేయబడిన రెండు యుద్ధనౌకలు మరియు ఐదు పెట్రోలింగ్‌ బోట్‌లతో కూడిన కోస్ట్‌గార్డ్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ విధంగా ఇది భారత పార్లమెంటు  కోస్ట్‌ గార్డ్‌ చట్టం 1978 ద్వారా 1 ఫిబ్రవరి 1977న అధికారికంగా స్థాపించబడిరది  ఇది రక్షణ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. భారత జలాలు మరియు ప్రత్యేక ఆర్థిక మండలిలో నిఘా కోసం కేవలం ఏడు నౌకల బలంతో ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ను 19 ఆగస్టు 1978న అప్పటి ప్రధాని  మొరార్జీ దేశాయ్‌ అధికారికంగా ప్రారంభించారు. మొదటి ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ షిప్‌ ఐ యన్‌ సి జి కుతార్‌  1978లో భారత నావికాదళం నుండి ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌కు బదిలీ చేయబడిరది. ప్రస్తుతం 158 నౌకలు, 78 విమానాలు మరియు 13,954 మంది సిబ్బంది ఉన్నారు.

ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ డే ప్రాముఖ్యత
ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌  నినాదం ‘‘మేము రక్షిస్తాము’’. మన దేశ సముద్ర సరిహద్దులను రక్షిస్తుంది మరియు సముద్ర మార్గాలలో జరిగే ఏవైనా అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలను నియంత్రిస్తుంది. సముద్రంలో మత్స్యకారులను కాపాడుతుంది. అవసరమైనప్పుడు వారికి సహాయం చేస్తుంది.  సముద్ర జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు కూడా పనిచేస్తుంది. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది కూడా శాస్త్రీయ సమాచారాన్ని సేకరిస్తారు.

విజన్‌ మరియు మిషన్‌
సముద్ర చట్టాలు మరియు నిబంధనలను అమలు చేస్తుంది, స్మగ్లింగ్‌, అక్రమ చేపలు పట్టడం మరియు ఇతర సముద్ర నేరాలను    అరికడుతుంది. చమురు మరియు ఇతర ఖనిజాలతో సహా మన సముద్రం మరియు ఆఫ్‌ షోర్‌ సంపదను తీవ్రవాదం, పైరసీ మరియు అక్రమ చొరబాట్లు నుండి రక్షిస్తుంది.  ఆపదలో ఉన్న నావికులకు సహాయం చేస్తుంది. సముద్రం, వేట, అక్రమ రవాణా మరియు మాదక ద్రవ్యాలకు సంబంధించి సముద్ర చట్టాలను అమలు చేస్తుంది. సముద్ర పర్యావరణం మరియు జీవావరణ శాస్త్రాన్ని సంరక్షించి అరుదైన జాతులను కాపాడుతుంది. శాస్త్రీయ డేటాను సేకరించి యుద్ధ సమయంలో నౌకాదళాన్ని బ్యాకప్‌  చేస్తుంది. స్మగ్లింగ్‌ వ్యతిరేక కార్యకలాపాలలో కస్టమ్స్‌ శాఖ మరియు ఇతర అధికారులకు సహాయం చేస్తుంది. ప్రారంభం నుండి నేటి వరకు సముద్రంలో సుమారు 11,561 మంది ప్రాణాలును కాపాడిరది.  సముద్రంలో స్మగ్లింగ్‌ నిరోధక మరియు మాదక ద్రవ్యాల నియంత్రణలో పాల్గొని 2023లో 478 కోట్లతో కలిపి 15343 కోట్ల రూపాయల విలువైన నిషిద్ధ వస్తువులను స్వాధీనం చేసుకుంది.                                             ˜

జనక మోహనరావు దుంగ
శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్‌
8247045230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *