సమస్యల పరిష్కారంలో టిఆర్‌ఎస్‌ ‌విఫలం

ధాన్యం కొనుగోళ్లలో ప్రణాళిక లేని సర్కార్‌
‌కాంగ్రెస్‌ ‌హయాంలోనే ప్రాజెక్టుల నిర్మాణం
నల్లగొండ జిల్లా పోరాటాల గడ్డ
రాహుల్‌ ‌వరంగల్‌ ‌సభకు వేలాదిగా తరలిరావాలి
జానారెడ్డి లేక శాసనసభ చిన్నబోయింది
సాగర్‌ ‌సన్నాహక సభలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌

‌నాగార్జునసాగర్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 : ‌రాష్ట్రంలో సమస్యల పరిష్కారంలో టిఆర్‌ఎస్‌ ‌పూర్తిగా విఫలమయిందని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ధ్వజమెత్తారు. తాము మొదలుపెట్టిన అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేని దద్దమ్మలు వి•రు.. అని ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నెల్లికల్లు లిప్ట్ ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని ఇప్పటికి మొదలు పెట్టలేదని, భూ కబ్జాలు చేసే ఎమ్మెల్యే సైదిరెడ్డి.. ఇసుక మాఫియాకు పాల్పడే మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు. నల్గొండ పర్యటన సందర్భంగా సాగర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ ‌సన్నాహక సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీని గెలిపిస్తారనే నమ్మకం తనకుందని, రైతులను వరి వేయొద్దని కేసీఆర్‌ ‌తన ఫామ్‌ ‌హౌస్‌లో 150 ఎకరాల వరి వేసాడని అగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మార్చి నెలలోనే ప్రభుత్వాన్ని హెచ్చరించామని, మిల్లర్లకు కోటా కేటాయించలేదు, బస్తాలు కొనలేదు, అకాల వర్షాలకు తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధర కల్పించి కొనాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. కొనకపోతే వి• అంతు తేల్చేదాక పోరాటం చేస్తామని అన్నారు. జానారెడ్డి లాంటి పెద్ద మనుషులు చట్టసభల్లో లేకపోవడం వల్ల సభలకు గౌరవం తగ్గిందని, ఏ సమస్య వొచ్చినా పరిష్కరించే సత్తా ఉన్న నాయకత్వం కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉందని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ ‌పార్టీలో పులులు, సింహాలు ఉన్నాయి.. కానీ ఆ పులులను సింహాలను ఆడించే సత్తా ఉన్న నాయకులు జానారెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు. ల్యాండు, సాండు, మాఫియాలు, మర్డర్లు చేసే టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి గుణపాఠం చెప్పలంటే నల్గొండ బిడ్డలు ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, సాయుధ పోరాట పటిమగల నాయకత్వం ఈ జిల్లాలో ఉందన్నారు. నాగార్జున సాగర్‌ ‌డ్యామ్‌ ‌కాంగ్రెస్‌ ‌హయాంలో కట్టామని సగర్వంగా చెప్పుకుంటామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు కాంగ్రెస్‌ ‌పార్టీ హయాంలోనే పూర్తయ్యాయన్నారు. కేంద్రానికి రాష్ట రాజకీయ ప్రయోజనమే కావాలి రైతు ప్రయోజనం అవసరంలేదని ఆయన ధ్వజమెత్తారు. వరంగల్‌ ‌సభ రైతుల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న సభ అని, వరంగల్‌ ‌సభ ద్వారా రైతులకు మేలు జరగాలన్నారు. రాహుల్‌ ‌సభకు వేలాదిగా కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలన్నారు. నల్లగొండ జిల్లాలో 9 మంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా అభివృద్ధిలో మాత్రం శూన్యం అని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.

నల్లగొండ జిల్లాకు గొప్ప చరిత్ర ఉందని అన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌తరఫున ముగ్గురు ఎమ్మేల్యేలు గెలిస్తే టీఆర్‌ఎస్‌ ‌నుంచి 9 మంది ఎమ్మెల్యేలు గెలిచారని అయినా అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. జిల్లాలో ప్రతి ప్రాజెక్టును కాంగ్రెస్‌ ‌హయాంలోనే కట్టారని, అసంపూర్తిగా మిలిగిపోయిన ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తి చేయలేదని అన్నారు. నాగార్జున సాగర్‌ ‌నియోజకవర్గంలో నెల్లికల్లు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని మంత్రి జగదీశ్‌ ‌రెడ్డిని రేవంత్‌ ‌ప్రశ్నిచారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నిస్తామని, రైతులకు అన్యాయం జరగనివ్వమని హావి• ఇచ్చారు. ఓరుగల్లు సభతో కాంగ్రెస్‌ ‌రాష్ట్రంలో రైతులకు అండగా నిలుస్తుందని రేవంత్‌ ‌రెడ్డి భరోసా ఇచ్చారు. రైతులను ఆదుకోవాల్సిన సర్కారు మద్దతు ధర ఇవ్వకపోవడంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయ భవిష్యత్‌ ‌తప్ప రైతు బాధలు పట్టవని రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. వరంగల్‌ ‌సభకు ప్రతి కార్యకర్త తొమ్మిది మంది చొప్పున కార్యకర్తలను తీసుకొచ్చి కాంగ్రెస్‌ ‌పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

ఇదిలావుంటే ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని కాంగ్రెస్‌ ఎం‌పీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆరోపించారు. యాసంగిలో వరి వేయొద్దని చెప్పి అన్నదాతలను సీఎం కేసీఆర్‌ ‌మోసం చేశారని మండిపడ్డారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు. ఇప్పటివరకు ధాన్యం బస్తాలనే కొనుగోలు చేయలేదన్నారు. మిర్చి పండించిన రైతులను కేసీఆర్‌ ‌కన్నీరు పెట్టిస్తున్నారన్నారు. కౌలు రైతులకు బ్యాంకు నుంచి లోన్లు రావడం లేదని..దేశంలో పంటల బీమా ఇవ్వని ఏకైక రాష్ట్రం తెలంగాణెళి అన్నారు. కేంద్రం ఎరువుల ధరలు పెంచడంతో రైతుల ఆదాయం సగానికి పడిపోయిందన్నారు. అన్నదాతలకు ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పిన కేసీఆర్‌..‌వారిని దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. వరంగల్‌ ‌లో జరిగే కాంగ్రెస్‌ ‌సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రైతులకు మేలు చేసే అంశాలపై రాహుల్‌ ‌గాంధీ స్పష్టమైన ప్రకటన చేస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు. నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ ‌విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్‌ ‌లో జరిగే రాహుల్‌ ‌గాంధీ సభకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు జనం తరలివస్తారనే నమ్మకం ఉందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకురాలు గీతారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా మెంబర్‌ ‌షిప్‌ ‌నమోదు అయ్యిందన్నారు. సభలో జానారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page